రాష్ట్రాభివృద్ధిపై భాజపా నేతలకు చిత్తశుద్ధి లేదు
భాజపా నేతలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏమాత్రం అవగాహన లేదని, ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ స్పృహ పెంచుకోవాలని ప్రభుత్వ విప్లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు విమర్శించారు.
ప్రభుత్వ విప్లు సునీత, బాలరాజు
ఈనాడు, హైదరాబాద్: భాజపా నేతలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏమాత్రం అవగాహన లేదని, ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ స్పృహ పెంచుకోవాలని ప్రభుత్వ విప్లు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై భాజపా నేతలకు చిత్తశుద్ధి లేదని, తెలంగాణకు ప్రత్యేకంగా ఏంతెచ్చారో వారు శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్లు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ గురించి భాజపా నేతలు ఆలోచించి మాట్లాడాలి. దేశాన్ని బాగుచేసేందుకే భారాస పక్క రాష్ట్రాలకు పోతోంది. కేసీఆర్పై నమ్మకంతో ఎందరో నేతలు భారాసతో కలిసేందుకు వస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ విషయాన్ని ప్రధాని మోదీతో చర్చించి నిర్ణయిస్తామని భాజపా నేతలు అనడం విడ్డూరం. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి లేదు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెడతారని అనుకున్నాం. ఈ ప్రారంభోత్సవానికి ఎన్ని పార్టీలు వచ్చాయి? ఎందరు ఎంపీలు వచ్చారో కేంద్ర మంత్రి చెప్పాలి. అంబేడ్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారు. దేశఖ్యాతిని పెంచే పని భాజపా చేయడం లేదు. దమ్ముంటే మిషన్ భగీరథ పెండింగ్ నిధులు తెచ్చి ఆ పార్టీ నేతలు ఇక్కడ మాట్లాడాలి’’ అని ప్రభుత్వ విప్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM