అల్పాహారంలో 6 రకాలు
తెదేపా మహానాడు ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ఉదయం 5 గంటలకే అల్పాహారం సిద్ధం చేశారు.
తెదేపా మహానాడు ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ఉదయం 5 గంటలకే అల్పాహారం సిద్ధం చేశారు. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశం మొదలుకుని ప్రతినిధుల సభ వరకు మూడుచోట్ల భోజనాలు, అల్పాహార తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇడ్లీ, మైసూర్ బజ్జీ, పునుగులు, టమోటా బాత్, పొంగల్, ఉప్మా అందించారు. మధ్యాహ్నం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి వచ్చిన వారికి వెజ్ బిర్యానీ, సాంబారు అన్నం, పెరుగన్నం అందించారు.
తెదేపా శ్రేణులకు చింతమనేని భోజనాలు
దుగ్గిరాల (పెదవేగి), న్యూస్టుడే: మహానాడుకు వెళ్లి తిరిగి వచ్చే తెదేపా నాయకులు, కార్యకర్తలకు భోజనాలు అందించేందుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం పెదవేగి మండలం దుగ్గిరాలలో తన ఇంటివద్ద భారీగా వంటలు వండించారు. 40 వేల మందికి సరిపడా వంటకాలను సిద్ధం చేసినట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దాంతో ఆదివారం సాయంత్రం నుంచి భోజనాలు వడ్డించడం ప్రారంభించారు. పలు జిల్లాల వారు ఇక్కడ ఆగి భోజనాలు చేసి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం