పేదల భూముల జోలికొస్తే సహించేది లేదు

కాంగ్రెస్‌ హయాంలో పేదలకిచ్చిన భూముల జోలికొస్తే సహించేది లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Published : 30 May 2023 04:47 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కందనూలు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ హయాంలో పేదలకిచ్చిన భూముల జోలికొస్తే సహించేది లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీపుల్‌్్సమార్చ్‌ పాదయాత్రలో భాగంగా సోమవారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా గగ్గలపల్లి, మంతటి, దేశిటిక్యాల గ్రామాల్లో పర్యటించారు. గగ్గలపల్లిలో పార్టీ జెండా ఎగురవేసి కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు ఇచ్చిన భూములకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గగ్గలపల్లిలోని దళితులు, గిరిజనులకు ఇచ్చిన భూములను తెలంగాణ సర్కారు ధరణిలో బ్లాక్‌లిస్టులో పెట్టడం తగదన్నారు. అభివృద్ధి పనులపేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సర్కారు భూములను.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి రైతులకు పంచుతామన్నారు. ధాన్యం విక్రయాలకు రైతులు పడుతున్న కష్టాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పాదయాత్రలో పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.మల్లురవి, నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని