ప్రజల్ని భాజపా దోచుకుంటోంది: కాంగ్రెస్
కేంద్రంలో తొమ్మిదేళ్ల పాలనలో తీవ్రస్థాయి ద్రవ్యోల్బణంతో ప్రజల ఆదాయాన్ని భాజపా ప్రభుత్వం దోచుకుందనీ, పైపెచ్చు.. ధరల పెరుగుదలకు కళ్లెం వేసినట్లు గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్ విమర్శించింది.
దిల్లీ: కేంద్రంలో తొమ్మిదేళ్ల పాలనలో తీవ్రస్థాయి ద్రవ్యోల్బణంతో ప్రజల ఆదాయాన్ని భాజపా ప్రభుత్వం దోచుకుందనీ, పైపెచ్చు.. ధరల పెరుగుదలకు కళ్లెం వేసినట్లు గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్ విమర్శించింది. పేదల జీవితాలు ఏమాత్రం మెరుగుపడకపోయినా గొప్ప విజయాలు సాధించినట్లు ఊదరగొట్టడానికి మంత్రులు సిద్ధపడుతున్నారని తెలిపింది. ముఖ్యమైన అన్నింటినీ జీఎస్టీ దెబ్బ కొట్టిందనీ, బడ్జెట్లను తలకిందులు చేసి, జీవితాలను దుర్లభంగా మార్చిందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విటర్లో విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుదల ఒక్కటే ప్రభుత్వం సాధించిన విజయమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ఎద్దేవా చేశారు. కూలీల వేతనాలు 0.2-0.8% మేర పెరిగితే వంటగ్యాస్ 169%, పెట్రోలు 57%, డీజిల్ 78%, పాలు 51%, గోధుమపిండి ధర 56% చొప్పున పెరిగిపోయాయని ట్వీట్లో వివరించారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఆదాయం 1,225% మేర పెరిగిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు