భారాసలోకి మధ్యప్రదేశ్ ముఖ్య నేతలు
దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి.
ఆహ్వానించిన సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, మేధావులు భారాసలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ముఖ్యనేతలు మంగళవారం గులాబీ కండువా కప్పుకొన్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సమక్షంలో భాజపాకు చెందిన మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే డా.నరేశ్సింగ్ గుర్జార్, ఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధీరేంద్రసింగ్, సాత్నా జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు విమల బాగ్రి, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్యాదవ్, భోపాల్కు చెందిన రాకేశ్ మాల్వీయ, సత్యేంద్రసింగ్ తదితరులు భారాసలో చేరారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం మధ్యప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని, భారాస సభ్యత్వం తీసుకోవడానికి అక్కడి ప్రజలు పెద్దఎత్తున సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. భోపాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, తప్పనిసరిగా రావాలని కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్ధసేన్ పటేల్ను మధ్యప్రదేశ్ రాష్ట్ర భారాస కోఆర్డినేటర్గా సీఎం నియమించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
నామినేషన్లకు వేళాయె..
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అడ్డంకులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. -
కాంగ్రెస్లో వలసల ప్రభావమెంత?
కాంగ్రెస్లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!