భారాసలోకి మధ్యప్రదేశ్ ముఖ్య నేతలు
దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి.
ఆహ్వానించిన సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, మేధావులు భారాసలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ముఖ్యనేతలు మంగళవారం గులాబీ కండువా కప్పుకొన్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సమక్షంలో భాజపాకు చెందిన మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే డా.నరేశ్సింగ్ గుర్జార్, ఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధీరేంద్రసింగ్, సాత్నా జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు విమల బాగ్రి, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్యాదవ్, భోపాల్కు చెందిన రాకేశ్ మాల్వీయ, సత్యేంద్రసింగ్ తదితరులు భారాసలో చేరారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి కోసం మధ్యప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని, భారాస సభ్యత్వం తీసుకోవడానికి అక్కడి ప్రజలు పెద్దఎత్తున సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. భోపాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, తప్పనిసరిగా రావాలని కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్ధసేన్ పటేల్ను మధ్యప్రదేశ్ రాష్ట్ర భారాస కోఆర్డినేటర్గా సీఎం నియమించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
DK Aruna: తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్: డీకే అరుణ
-
Stock Market: నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 19,450 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ
-
Ranbir Kapoor: రణ్బీర్ కపూర్కు ఈడీ సమన్లు
-
Union Cabinet: పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సిలిండర్పై రాయితీ ₹300లకు పెంపు
-
Nellore: నెల్లూరులో ఉద్రిక్తత.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
-
Sai Pallavi: రాముడిగా రణ్బీర్.. సీతగా సాయిపల్లవి ఫిక్స్!