నేటి నుంచే భాజపా ‘మహా జన్సంపర్క్ అభియాన్’
తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, కార్యక్రమాల గురించి ఇంటింటికీ తెలియజేయడమే లక్ష్యంగా భాజపా ప్రత్యేక ప్రచారం చేపట్టింది.
ప్రతి లోక్సభ నియోజకవర్గంలో వెయ్యి మంది ప్రముఖులతో భేటీ
ముంబయి: తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, కార్యక్రమాల గురించి ఇంటింటికీ తెలియజేయడమే లక్ష్యంగా భాజపా ప్రత్యేక ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి లోక్సభ నియోజకవర్గంలో వెయ్యి మంది ప్రముఖ వ్యక్తులను కాషాయ దళం నేతలు కలవనున్నారు. ‘మహా జన్సంపర్క్ అభియాన్’ పేరుతో చేపడుతున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం బుధవారం(ఈ నెల 31) నుంచి జూన్ 30 వరకు కొనసాగనుంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఉన్న 1,000 మంది ప్రముఖ వ్యక్తుల జాబితాను సిద్ధం చేశాం. పద్మ అవార్డులు, రాష్ట్రపతి పతకాలు వంటి పురస్కారాలు సాధించిన వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరినీ కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు కలిసి భాజపా విజయాలను వివరిస్తారు. నెల వ్యవధిలో దాదాపు 5.5లక్షల మందితో మా నేతలు సమావేశమవుతారు’’ అని తావ్డే వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 10 కీలక సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసినట్లు వినోద్ తావ్డే చెప్పారు. ఆ లబ్ధిదారులతో స్థానికంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో నిర్వహించే వివిధ సభల్లో ప్రధాని మోదీతో పాటు పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్