మరో 15 ఏళ్లు అధికారం మనదే.. గోడ దూకొద్దు
రాష్ట్రంలో మరో 15 ఏళ్లు భారాస మాత్రమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని.. ఎవరూ గోడ దూకొద్దని సూచించారు.
భారాస నాయకులు, కార్యకర్తలతో మంత్రి శ్రీనివాస్గౌడ్
షాద్నగర్, న్యూస్టుడే: రాష్ట్రంలో మరో 15 ఏళ్లు భారాస మాత్రమే అధికారంలో ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని.. ఎవరూ గోడ దూకొద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రూ.170 కోట్లతో చేపట్టిన పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్కు ముందు.. కేసీఆర్ తరువాత అని మాట్లాడుకునేంతగా అభివృద్ధి పనులు చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 వేల పింఛను రూ.200కు తగ్గుతుందని, కరెంటు కోతలు మళ్లీ మొదలవుతాయని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను ఎత్తేస్తారని ఆరోపించారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తప్ప భాజపా నాయకులు దేశానికి ఏం చేశారో ఏనాడూ చెప్పరన్నారు. ప్రైవేటీకరణతో ఉద్యోగుల పొట్టకొట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి గ్రామాల్లో ప్రచారం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జడ్పీ ఛైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం