మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం..
‘మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
తిరుపతి (నగరం), న్యూస్టుడే: ‘మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం గృహ నిర్మాణ ప్రగతిపై జరిగిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ ఎక్కువగా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండటంతో తనకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న సమావేశంలో కూడా తనకు ఇరువైపులా రెడ్లే ఎక్కువగా ఉన్నారన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పేదలకు కొండలు, గుంటలు, మిట్టలు ఉన్న చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై గట్టిగా మాట్లాడే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి నియోజకవర్గంలో అన్ని రకాలుగా అనువైన చదును భూములు జగనన్న కాలనీలకు ఇచ్చారని తెలిపారు. బాలకృష్ణాపురంలో జలకళ పథకం కింద చంద్రబాబు వర్గీయులకు 25 బోర్లు మంజూరు చేశారన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నా.. మనకు మాత్రం ఓటు వేయరని తెలిపారు. నియోజకవర్గంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని దళితులు ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఏ కులానికి ఎన్ని ఇళ్లు కేటాయించారో అధికారుల వద్ద లెక్కలు లేకపోవడం శోచనీయమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాగ్రత్త : నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు
-
Mynampally: మల్కాజిగిరి నుంచే పోటీ.. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: మైనంపల్లి
-
TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ను తొలగించాలి.. ఓయూలో విద్యార్థుల ఆందోళన
-
Vande bharat express: కాచిగూడ- యశ్వంత్పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
-
High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్.. వెల్లడించిన రైల్వే మంత్రి
-
Vizag: గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి.. విశాఖలో బాలుడి హత్య