మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం..
‘మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
తిరుపతి (నగరం), న్యూస్టుడే: ‘మా పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువగా ఉంది’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం గృహ నిర్మాణ ప్రగతిపై జరిగిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ ఎక్కువగా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండటంతో తనకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న సమావేశంలో కూడా తనకు ఇరువైపులా రెడ్లే ఎక్కువగా ఉన్నారన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పేదలకు కొండలు, గుంటలు, మిట్టలు ఉన్న చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై గట్టిగా మాట్లాడే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి నియోజకవర్గంలో అన్ని రకాలుగా అనువైన చదును భూములు జగనన్న కాలనీలకు ఇచ్చారని తెలిపారు. బాలకృష్ణాపురంలో జలకళ పథకం కింద చంద్రబాబు వర్గీయులకు 25 బోర్లు మంజూరు చేశారన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నా.. మనకు మాత్రం ఓటు వేయరని తెలిపారు. నియోజకవర్గంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని దళితులు ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఏ కులానికి ఎన్ని ఇళ్లు కేటాయించారో అధికారుల వద్ద లెక్కలు లేకపోవడం శోచనీయమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామీ గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్