జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం: ఆనందబాబు
విడిపోయిన రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లోనూ చంద్రబాబు అంచలంచెలుగా అభివృద్ధి చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: విడిపోయిన రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లోనూ చంద్రబాబు అంచలంచెలుగా అభివృద్ధి చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరులో మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబు హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాజధాని అమరావతిని నాశనం చేశారు. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్నవాటిని తరిమేశారు. ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలు లేవు. యువతను నిర్వీర్యం చేశారు. విధ్వంసాలు, దోపిడీలు, అక్రమాలు, అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. నాలుగేళ్లలో రూ.తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టించడం చేతగాదు. ఒక లక్ష్యం లేదు’.. అని ఆనందబాబు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్