చంద్రబాబుపై రాజకీయ కుట్ర జరుగుతోంది
బ్లాక్ క్యాట్ కమాండోలను తొలగిస్తే తెదేపా అధినేత చంద్రబాబు ఫినిష్ అయిపోతారని శాసనసభ స్పీకర్ తమ్మినేని పేర్కొన్న నేపథ్యంలో డీజీపీ తక్షణం కుట్ర కేసు నమోదు చేసి తమ్మినేని సహా బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళవారం డీజీపీకి రాసిన లేఖలో సూచించారు.
డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ
ఈనాడు,అమరావతి: బ్లాక్ క్యాట్ కమాండోలను తొలగిస్తే తెదేపా అధినేత చంద్రబాబు ఫినిష్ అయిపోతారని శాసనసభ స్పీకర్ తమ్మినేని పేర్కొన్న నేపథ్యంలో డీజీపీ తక్షణం కుట్ర కేసు నమోదు చేసి తమ్మినేని సహా బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళవారం డీజీపీకి రాసిన లేఖలో సూచించారు. ‘తమ్మినేని హెచ్చరికతో చంద్రబాబుపై పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది...’ అని వర్ల పేర్కొన్నారు. ‘చంద్రబాబుపై దాడి చేసే విధానం ఎలాగంటే.. ముందు ఆయనపై దాడి చేస్తామని బెదిరిస్తారు.. రెండో దశలో ఆయన టూర్ రూట్ మ్యాప్ను ఆధారంగా చేసుకుని చివరి నిమిషంలో కౌంటర్ ప్రోగ్రాంకు ప్లాన్ చేస్తారు. మూడో దశలో వైకాపా రౌడీలను, గూండాలను, అసాంఘిక శక్తులను కూడగట్టి కాన్వాయ్ను వెంబడించి గందరగోళం సృష్టిస్తారు. నాలుగో దశలో వైకాపా గూండాలతో కాన్వాయ్, తెదేపా మద్దతుదారులపై రాళ్ల దాడి చేయిస్తారు. చివరి దశలో.. పోలీసులు దాడి చేసిన వారిని వదిలిపెట్టి తెదేపా నాయకులు, కార్యకర్తలపై బలమైన సెక్షన్లు ప్రయోగించి కేసులు పెడతారు...’ అని వర్ల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!