మేనిఫెస్టో పేరుతో మోసం చేసేందుకు తెదేపా యత్నం: మంత్రి జోగి రమేష్
మహానాడులో తెదేపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అధికారం కోసం ప్రజలను మోసం చేసేలా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు.
తిరుపతి(నగరం), న్యూస్టుడే: మహానాడులో తెదేపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అధికారం కోసం ప్రజలను మోసం చేసేలా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన గృహనిర్మాణ ప్రగతిపై సమీక్షలో ఆయన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘చంద్రబాబునాయుడు 2014లో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం పది హామీలు కూడా అమలు చేయలేదు. వచ్చే ఎన్నికల కోసం అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు తెదేపా ప్రకటించింది. ఒంటరిగానే పోటీ చేసి వైకాపా 151 సీట్లకు పైగా సాధించడం ఖాయం...’ అని పేర్కొన్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు జగనన్న కాలనీల పేరుతో దాదాపు 22 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. జులై నాటికి ఐదు లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్