4 ఏళ్ల మోసకారి పాలనలో.. నేరాలు, విధ్వంసాలు, లూటీలే
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి.. వివేకా హత్య విషయం ముందే తెలుసని సీబీఐ చెప్పాక కూడా, ఆయన తన పదవికి రాజీనామా చేయకపోవడం అర్థరహితమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
జగన్ ఖజానా కళకళ.. జనం బతుకులు వెలవెల
ధ్వజమెత్తిన తెదేపా నేతలు
వైకాపా పాలనపై తెదేపా ఛార్జిషీట్ విడుదల
ఈనాడు - అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి.. వివేకా హత్య విషయం ముందే తెలుసని సీబీఐ చెప్పాక కూడా, ఆయన తన పదవికి రాజీనామా చేయకపోవడం అర్థరహితమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ‘వివేకా హత్య కేసులో సీబీఐ వచ్చి ఎప్పుడు తనను, భారతీరెడ్డిని ప్రశ్నిస్తుందో అనే అభద్రతాభావంలో జగన్ ఉన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి 2019 మార్చి 15న ఆయన చేసిన కార్యక్రమమే.. ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చునే పరిస్థితికి కారణం’ అని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జగన్ నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్ను పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు అశోక్బాబు, పంచుమర్తి అనురాధ, జాతీయ అధికార ప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్ విడుదల చేశారు.
’మోసకారి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రైతులు దివాలా తీశారు. యువత నైరాశ్యంలో మునిగిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ కరవైంది. సంక్షేమ పథకాలను సంక్షోభంలోకి నెట్టారు. మౌలిక వసతుల రంగం కుదేలైంది. పాలన అంతా నేరాలు, ఘోరాలు.. లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలతో నిండిపోయింది’ అని వారు ధ్వజమెత్తారు.
అబద్ధాల పుట్ట
* 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చాక.. అవినీతి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేశారు.
* ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ నిందలేసి.. అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. దీనిపై ఎలాంటి రుజువులు చూపకపోవడంతో హైకోర్టు కొట్టేసింది.
* అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పారు. తర్వాత మూడు రాజధానులంటూ.. రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు.
* వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు సహా తెదేపా నేతల ప్రమేయం ఉందని, కేసు సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ డిమాండు చేశారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దంటూ ఆయనే పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
* ఏడాదికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. నాలుగేళ్లలో నిర్మించింది అయిదు ఇళ్లేనని (పీఎంఏవై రూరల్) కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి సభలో చెప్పారు.
* నిర్మించని రింగ్రోడ్డులో లింగమనేని రమేశ్, నారాయణ కుటుంబీలకు అయాచిత లబ్ధి చేశారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
మాట తప్పి, మడమ తిప్పిన జగన్రెడ్డి
* మద్యనిషేధం
* వారంలో సీపీఎస్ రద్దు
* ఇద్దరు పిల్లలకూ అమ్మఒడి
* 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ
* మెగా డీఎస్సీ
* అమరావతి రాజధాని
* మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి
* డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రూ.10 లక్షలకు పెంపు
* రైతు భరోసా రూ.12,500 ఇస్తామని రూ.7,500కి కుదింపు
* కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడం
ఛార్జిషీట్లోని ప్రధానాంశాలివీ..
నేరాలు, ఘోరాలు
జగన్ అనుమతి లేకుండా.. ఎవరో వచ్చి ఆయన చిన్నాన్నను హత్య చేయడం సాధ్యమా?
70 ఏళ్ల వయసు పైబడి, గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వైఎస్ వివేకానందరెడ్డిని రాత్రి ఒంటి గంట, రెండు గంటల మధ్య పిడిగుద్దులు గుద్ది, గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేయించారు. జగన్రెడ్డి అనుమతి లేకుండా.. ఆయన చిన్నాన్నను ఎవరో వచ్చి హత్య చేయడం సాధ్యమవుతుందా? వివేకా హత్య బయటి ప్రపంచానికి తెలియకముందే జగన్రెడ్డికి తెలుసని సీబీఐ.. కోర్టులో అఫిడవిట్ వేసింది. హత్య జరిగాక తెల్లవారుజామునే అవినాష్రెడ్డి.. జగన్, భారతిలతో వారి పీఏల ఫోన్ల ద్వారా మాట్లాడినట్లు రుజువైంది. ఆ సమయంలో హత్య గురించి కాకుంటే మరి దేనిపై మాట్లాడతారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని నమోదు చేయాలంటూ సీఐని అవినాష్రెడ్డి బెదిరించినట్లు రుజువైంది. అయినా అసెంబ్లీలోనే అవినాష్రెడ్డికి సీఎం క్లీన్చిట్ ఇవ్వడం.. ఆయన్ను సమర్థించడం కాదా? తనతోపాటు భార్య పాత్రను కప్పిపెట్టడానికేనా? వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి.. విచారణకు సహకరించాలి.
లూటీల పాలన
* నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్ల అప్పు తెచ్చి అందులో రూ.2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు. మిగిలిన రూ.4 లక్షల కోట్లు ఏమయ్యాయి? ఇవి కాకుండా పెంచిన పన్నులు, ధరలు, ఛార్జీల ద్వారా వచ్చిన నిధులు ఎటు పోయాయి?
* జగన్ నాలుగేళ్ల పాలనలో ఒక్కో కుటుంబంపై.. పెరిగిన ధరలతో రూ.2,40,000, పెంచిన పన్నులతో రూ.1,52,413, అప్పుల రూపంలో రూ.3,94,000 కలిపి.. మొత్తం రూ.7,86,413 భారం మోపారు.
* నాలుగేళ్లలో (2019-23) జగన్రెడ్డి కుటుంబం మొత్తం రూ.2,27,500 కోట్లు లూటీ చేసింది. 2004-09 మధ్య సీబీఐ గుర్తించిన ఆస్తులు రూ.43 వేల కోట్లు, గుర్తించనివి రూ.60 వేల కోట్లు మొత్తం కలిపితే రూ.3,30,500 కోట్లు దోచేశారు. ఇది లూటీ కాక మరేంటి?
విధ్వంసాల మయం
* జగన్రెడ్డి తన విధ్వంసక పాలనతో రూ.2 లక్షల కోట్ల విలువైన అమరావతిని నిర్వీర్యం చేశారు. 26 జిల్లాల జీవనాడైన పోలవరాన్ని అటకెక్కించారు. 3 వేల మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు.
* స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్, కిడ్నాప్, ఆస్తుల ధ్వంసం, బలవంతపు ఏకగ్రీవాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై 2 వేలకు పైగా దాడులకు పాల్పడ్డారు.
* ప్రభుత్వ అడ్డగోలు, అప్రజాస్వామిక నిర్ణయాల్ని అసంబద్ధ ఉత్తర్వుల్ని రద్దు చేశారనే అక్కసుతో న్యాయవ్యవస్థపైనే దాడికి దిగారు.
* పోలీస్ వ్యవస్థను ప్రైవేటు సైన్యంలా మార్చుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారు.
* భూముల దోపిడీ కోసం ఎయిడెడ్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు.
విద్వేషాల అడుగులు
* కుల, మత, ప్రాంత, పార్టీల పేరుతో విద్వేష రాజకీయాలు చేస్తూ 6 లక్షల మందికి పింఛన్లు తొలగించారు. రైతు భరోసాకు కులాలు ఆపాదించారు.
* సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తెదేపా సామాజిక మాధ్యమ కార్యర్తలపై సీఐడీ పోలీసులు 150కి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు.
* నాలుగేళ్లలో 73 మంది తెదేపా కార్యకర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వేల మంది నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీలపై ఎట్రాసిటీ కేసులు పెట్టి ఆ చట్టాన్ని నీరుగార్చుతున్నారు.
* తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర, జర్నలిస్టులు కోగంటి శ్రీనివాసులు, కొల్లా అంకబాబు, రమ్య దాసరి, పరుచూరి కోటి తదితరుల్ని అక్రమంగా అరెస్టు చేశారు. 60 ఏళ్ల వయసున్న రంగనాయకమ్మపై అక్రమ కేసు బనాయించారు.
* ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అరాచకాల్ని మీడియాలో బయటపెట్టారని తెదేపా కార్యకర్త, చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పలమనేరు ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. -
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
జేఎంఎం అధినేత శిబూ సోరెన్ పెద్ద కోడలు, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ మంగళవారం భాజపాలో చేరారు. -
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. -
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
భాజపా ఇచ్చిన హామీలకు 2004 ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. -
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. -
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్లో చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా