బ్రిజ్‌భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

Published : 01 Jun 2023 04:16 IST

ఎమ్మెల్సీ కవిత 

ఈనాడు - హైదరాబాద్‌, నిజామాబాద్‌: రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు నిరసనలు.. ఆందోళనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కష్టపడి, నిబద్ధతతో, దేశభక్తితో మహిళా రెజ్లర్లు ప్రపంచానికి భారతదేశ ప్రతిభను చాటిచెప్పారని.. ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ‘పోక్సో’ వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ నిందితుడు బయట తిరుగుతున్నారని, బాధితులకు న్యాయాన్ని నిరాకరించరాదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని