12న విపక్షాల భేటీకి హాజరవుతాం: కాంగ్రెస్‌

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్‌కుమార్‌ ఈ నెల 12న పట్నాలో నిర్వహిస్తున్న విపక్షాల సమావేశానికి హాజరవుతామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది.

Published : 02 Jun 2023 03:49 IST

దిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్‌కుమార్‌ ఈ నెల 12న పట్నాలో నిర్వహిస్తున్న విపక్షాల సమావేశానికి హాజరవుతామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. అయితే, పార్టీ తరఫున ఎవరిని అక్కడికి పంపించాలన్నది ఇంకా నిర్ణయించలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్‌) జైరాం రమేశ్‌ గురువారం దిల్లీలో విలేకరులతో అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా హాజరవుతారా, మరెవరినైనా పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు