ఇలాంటి సస్పెన్షన్ను ఊహించలేకపోయా
లోక్సభలో తనపై అనర్హత వేటు పడుతుందన్న విషయాన్ని రాజకీయాల్లో చేరినప్పుడు ఊహించలేకపోయానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
స్టాన్ఫోర్డ్ విద్యార్థులతో సమావేశంలో రాహుల్గాంధీ
స్టాన్ఫోర్డ్ (కాలిఫోర్నియా): లోక్సభలో తనపై అనర్హత వేటు పడుతుందన్న విషయాన్ని రాజకీయాల్లో చేరినప్పుడు ఊహించలేకపోయానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులతో, భారత సంతతి విద్యావేత్తలతో ముచ్చటించారు. కిక్కిరిసిన ఆడిటోరియంలో వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మోదీ అనే ఇంటిపేరున్నవారికి సంబంధించి చేసిన వ్యాఖ్యపై శిక్ష నేపథ్యంలో ఎంపీగా రాహుల్పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ‘2000 సంవత్సరంలో రాజకీయాల్లో నేను అడుగుపెట్టినప్పుడు ఇప్పటి పరిణామాలను ఏమాత్రం ఊహించలేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే భావించలేదు. తర్వాత మాత్రం- ప్రజలకు సేవ చేసేందుకు నాకిదో మహత్తర అవకాశమని భావించాను. నాకు రావాల్సినదానికంటే పెద్ద అవకాశమే ఇది. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి’ అని రాహుల్ చెప్పారు.
పోరాటంపై స్పష్టత ఉంది
‘ఇప్పుడు భారత్లో విపక్షమంతా సంఘర్షణ పడుతోంది. ఈ కథ కొన్నినెలల క్రితం మొదలైంది. అప్పట్లో ప్రతిపక్షాలన్నీ చిక్కుల్లో ఉన్నాయి. ఆర్థికవనరుల పరంగా అధికారపక్ష ఆధిపత్యం, వ్యవస్థలపై పెత్తనం నడుస్తున్నాయి. మా దేశంలోనే మేం ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి అవస్థలు పడుతున్నాం. పోరాటంపై నాకు చాలాస్పష్టత ఉంది’ అని రాహుల్గాంధీ వివరించారు. భారత్- చైనా సంబంధాలు కఠినంగా ఉండబోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాపై తటస్థ వైఖరి సబబేనని సమర్థించారు. దేశ ప్రయోజనాలనూ చూసుకోవాలని అన్నారు.
హలో మోదీ.. నా ఫోన్ ట్యాప్ చేశారని తెలుసు
తన ఐఫోన్ను ట్యాప్ చేసిన విషయం తెలుసని రాహుల్గాంధీ చెప్పారు. సరదాగా తన ఫోన్వైపు చూస్తూ ‘హలో.. మోదీ’ అని పలకరించారు. సిలికాన్ వ్యాలీలోని అంకుర పారిశ్రామికవేత్తలతో వివిధ రకాల సాంకేతికతలు, ఏఐ, డ్రోన్లు వంటివాటి గురించి ఆయన మాట్లాడారు. ‘భారత్లో డ్రోన్ వంటి టెక్నాలజీలు అధికారిక నిబంధనల అడ్డంకిని ఎదుర్కొంటాయి. పెగాసస్ వంటి టెక్నాలజీలకు నేను భయపడను. డేటా ప్రైవసీకి కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం మీ ఫోన్ను ట్యాప్ చేయాలని నిర్ణయిస్తే ఎవరూ ఆపలేరు’ అని వ్యాఖ్యానించారు. అమెరికాతో కేవలం ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలే సరిపోవనీ.. డేటా, కృత్రిమ మేధ (ఏఐ) వంటి రంగాల్లోనూ భాగస్వామ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంపై రాహుల్కు ఉన్న లోతైన అవగాహన అబ్బురపరిచిందని ‘ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్’ సీఈవో సయీద్ అమిది చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్