సీపీఐ ప్రజాగర్జన సభ 11న: కూనంనేని
సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభ తేదీని జూన్ 4 నుంచి 11కి మార్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభ తేదీని జూన్ 4 నుంచి 11కి మార్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారమిక్కడ మగ్దూంభవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొత్తగూడెంలో సీపీఐ ప్రజాగర్జన సభకు సన్నాహాలు చేసుకుంటున్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మా సభ జరిగే ప్రదేశంలోనే జూన్ 5న సింగరేణి.. విద్యుత్ డేను నిర్వహిస్తోంది. దీంతో మా సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మైదానాన్ని 4వ తేదీ రాత్రికి అప్పగిస్తామని చెప్పినప్పటికీ, సింగరేణి యాజమాన్యం అంగీకరించలేదు. చివరకు ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడినా ఇలా వ్యవహరించడం సరైంది కాదు’ అంటూ మండిపడ్డారు. జాతీయస్థాయిలో మాదిరి భాజపాకు వ్యతిరేకంగా లౌకికపార్టీలన్నీ రాష్ట్రంలో ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో 11 లక్షల ఎకరాలకు పోడు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారనీ.. ఇప్పుడేమో 4 లక్షలకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందంటూ తప్పుబట్టారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో కార్మికసంఘ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను శుక్రవారం నిర్వహించనున్నట్లు కూనంనేని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?