మళ్లీ ముఖ్యమంత్రి వద్దకు బాలినేని
మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మరోసారి ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి ఏప్రిల్ 29న రాజీనామా చేసిన ఆయన మే 2న సీఎంతో భేటీ అయ్యారు.
నెల దాటినా పట్టువీడని మాజీ మంత్రి
ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మరోసారి ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి ఏప్రిల్ 29న రాజీనామా చేసిన ఆయన మే 2న సీఎంతో భేటీ అయ్యారు. ‘ఆ పదవిలో కొనసాగాలి.. మీరే ఇలా రాజీనామా చేస్తే పార్టీ శ్రేణులకు ఏం సందేశం వెళుతుంది?’ అని సీఎం నచ్చజెప్పినా ఆయన అప్పుడు వెనక్కు తగ్గలేదు. ఆయన రాజీనామాను సీఎం అంగీకరించనూ లేదు. నెల గడిచాక గురువారం మళ్లీ బాలినేని సీఎంను కలిశారు. ఈ భేటీ తర్వాత కూడా ఆయన ప్రాంతీయ సమన్వయకర్తగా కొనసాగుతారా? లేదా? అనేది స్పష్టత రాలేదు. పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్న వారి గురించి బాలినేని సీఎంతో చర్చించినట్లు సమాచారం.
సీఎంతో భేటీ తర్వాత అక్కడే బాలినేని మీడియాతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘నాకు ప్రొటోకాల్ కల్పించడంపై సీఎంతో మాట్లాడలేదు. గతంలో మంత్రి పదవినే వదిలేశాను.. ప్రొటోకాల్ గురించి తాపత్రయపడక్కర్లేదు. నేనెప్పుడూ పార్టీపై అలకబూనలేదు. పార్టీలోని ఇద్దరు ముగ్గురు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంశంపైనే పోరాడుతున్నా. దీనిపై సీఎంతోనూ చర్చించా. సర్దుబాటు చేస్తామని ఆయన హామీనిచ్చారు. ప్రాంతీయ సమన్వయకర్త పదవికి చేసిన రాజీనామాపైగానీ, కొత్త పోస్టు గురించి కానీ సీఎంతో మాట్లాడలేదు. పార్టీలో ఉన్నవారు కావాలనే ఇలా నాపై మీడియాకు ఇలాంటి విషయాలు చెబుతున్నారు. మా జిల్లాలో ఉన్న సమస్యలు, ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీపైనా సీఎంతో మాట్లాడా. సీఎంను కలుస్తూనే ఉన్నా.. కలుస్తూనే ఉంటా. అలాంటప్పుడు నేను పార్టీ మారుతున్నానని అనడంలో అర్థం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్