జనంలోకి పవన్కల్యాణ్
‘‘జనసేన అధినేత పవన్కల్యాణ్ జూన్ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న తర్వాత ఈ పర్యటన మొదలవుతుంది.
జూన్ 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభం
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో.. 11 నియోజకవర్గాల రూట్మ్యాప్ ఖరారు
జనసేన నేత మనోహర్ వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘‘జనసేన అధినేత పవన్కల్యాణ్ జూన్ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న తర్వాత ఈ పర్యటన మొదలవుతుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు ఉండి ప్రజలతో మమేకమై.. అక్కడి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. జనసైనికులు, వీర మహిళలతో సమావేశమవుతూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకుంటారు. నియోజకవర్గానికో బహిరంగ సభ కూడా ఉంటుంది’’ అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జనసేన నాయకులు, పీఏసీ సభ్యులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్కల్యాణ్ వారాహి యాత్ర రూట్మ్యాప్ ఖరారు చేసినట్లు వెల్లడించారు.
ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, అక్కడి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం వరకు మార్గం ఖరారైందని మనోహర్ వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నాయకులు రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటుచేసుకుని తదుపరి రూట్మ్యాప్ ఖరారు చేస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు తదితరులతో సమావేశాలు ఏర్పాటుచేసి సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి జనసేన తరఫున ప్రణాళిక సిద్ధం చేసేలా ఈ పర్యటన ఉంటుందని మనోహర్ వెల్లడించారు. ఆ నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న సమస్యను ప్రత్యక్షంగా పరిశీలిస్తారన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ఇది ఎన్నికల ర్యాలీ లాంటిది కాదని, ప్రజలకు దగ్గరయ్యేందుకు, సమస్యలు తెలుసుకోవడానికి చేపడుతున్న కార్యక్రమమని మనోహర్ పేర్కొన్నారు. కళాకారులు, కల్లుగీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు, మహిళలు, మత్స్యకారులతో, చేనేత వృత్తివారితో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పొత్తు ఆలోచనలో భాగంగానే ఉభయగోదావరి జిల్లాల్లో రూట్మ్యాప్ ఖరారు చేస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ కాదని, జనసేన పార్టీ బలోపేతానికి చేస్తున్న యాత్ర అని పేర్కొన్నారు. తమ యాత్రకు పోలీసుల సహకారం కూడా అవసరమని, తాము ఎప్పుడూ వారికి సహకరిస్తూనే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే రాజకీయ పార్టీగా తమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామన్నారు. ఈ యాత్ర తర్వాత మళ్లీ ఆయన షూటింగులకు వెళ్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘‘పవన్కల్యాణ్ కష్టం, ఆయన సంపాదించిన నిధులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసైనికుల సాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయన సినిమాల ద్వారా వచ్చే ఆదాయం పార్టీకి కచ్చితంగా ఉపయోగపడుతుంది. సందర్భం వచ్చినప్పుడు పూర్తిస్థాయి సమయం రాష్ట్ర ప్రజలు, రాష్ట్రాభివృద్ధి కోసమే కేటాయిస్తానని పవన్కల్యాణ్ ఇప్పటికే చెప్పారు. అవసరమైతే షూటింగులకు ఇచ్చిన కమిట్మెంట్లు కూడా పక్కన పెట్టి కూడా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని మనోహర్ చెప్పారు. పార్టీ మేనిఫెస్టోను ఎన్నికల సమయంలోనే వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, కనకరాజు సూరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ