గాంధీభవన్‌కు వచ్చిన కేఎల్‌ఆర్‌

మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్‌) తిరిగి కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి గాంధీభవన్‌కు వచ్చారు.

Updated : 03 Jun 2023 05:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్‌) తిరిగి కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికి గాంధీభవన్‌కు వచ్చారు. ఆయన గతంలో కాంగ్రెస్‌లోనే ఉండేవారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన రోజున ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి పార్టీలోకి రావాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆయనతో చర్చించడంతో శుక్రవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానన్నారు.


తెదేపా రాష్ట్ర మహిళా కమిటీ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా రాష్ట్ర మహిళా కమిటీ కార్యవర్గాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ కమిటీలో 36 మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని