ఉద్యోగాలపై చర్చకు సిద్ధం: మంత్రి జగదీశ్రెడ్డి
భాజపా పాలన కొనసాగుతున్న గుజరాత్తో తెలంగాణ అభివృద్ధిని పోల్చి చూద్దామా... అని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరారు.
సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్టుడే: భాజపా పాలన కొనసాగుతున్న గుజరాత్తో తెలంగాణ అభివృద్ధిని పోల్చి చూద్దామా... అని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. సూర్యాపేటలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘డబుల్ ఇంజిన్ సర్కారంటూ గొప్పలకు పోతున్న కేంద్రం గుజరాత్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిస్తే... దేశంలోని మొత్తం భాజపా పాలిత రాష్ట్రాల్లో కలిపి ఇచ్చిన ఉద్యోగాలు చాలా తక్కువ. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణపై కిషన్రెడ్డికి ప్రేముంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చాక మాట్లాడాలి. సరైన ప్రత్యామ్నాయం లేకనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంటే నడుస్తోంది. 2023 ఎన్నికల్లోనూ గత రెండు ఎన్నికల్లో జరిగిందే పునరావృతం అవుతుంది’’ అని ధీమా వ్యక్తంచేశారు.
కిషన్రెడ్డికి అభివృద్ధి కనిపించట్లేదా?: పీయూసీ ఛైర్మన్ జీవన్రెడ్డి
నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: హైదరాబాద్ ఇదివరకెలా ఉండే... ఇప్పుడెలా ఉందనే విషయం కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కనిపించట్లేదా? అని పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. నిజామాబాద్లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల పేరిట కిషన్రెడ్డి నీచ రాజకీయం చేశారు. భారాస ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది. కాదని నిరూపిస్తే మేం రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం. నిరూపించకుంటే కిషన్రెడ్డి రాజీనామా చేయాలి’’ అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, రాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా