కోడెల కుటుంబానికి న్యాయం జరుగుతుంది
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకు పార్టీ తప్పక న్యాయం చేస్తుందని, కోడెల కుటుంబాన్ని తప్పక గౌరవించాల్సిందేనని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఈనాడు డిజిటల్, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకు పార్టీ తప్పక న్యాయం చేస్తుందని, కోడెల కుటుంబాన్ని తప్పక గౌరవించాల్సిందేనని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్నికలకు ముందా.. తర్వాతా అనేది త్వరలోనే తేలుతుందని తెలిపారు. ఫౌండేషన్లు, ట్రస్టుల పేర్లతో ఈ మూడు, నాలుగు నెలల నుంచి పార్టీలోకి వచ్చేవారిది హడావుడేనని పేర్కొన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భాష్యం ప్రవీణ్కు.. చిలకలూరిపేటకు సంబంధం ఏంటి? ఆయనకు అక్కడ ఓటే లేదు. ట్రస్టులు, ఫౌండేషన్ల పేరుతో వచ్చే వారు రేపు సీటివ్వకపోతే కనపడతారా? ఒకవేళ గెలిస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. పార్టీ కూడా ఇలాంటి వారి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. అసలు వీరంతా ఈ నాలుగేళ్లు ఏమయ్యారు? ఇలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినవారు, కేసులు పెట్టించుకున్న వారు ఏమవుతారు? కష్టపడి పనిచేసే వారిని చంద్రబాబు తప్పక గుర్తిస్తారు. వారికి అన్యాయం జరగదు. సమర్థత ఉన్నవారికి, యువతకు కచ్చితంగా సీటు ఇవ్వాలి. కొత్తగా వచ్చి హడావుడి చేసేవారి ట్రాక్ రికార్డును పరిశీలించాలి’ అని పుల్లారావు పేర్కొన్నారు. సీనియర్లు పార్టీ కోసం కష్టపడుతున్నారని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్