ఎన్నికలకు ముందే ‘తల్లికి వందనం’ టోకెన్లు

రాష్ట్రంలో అన్నివిధాలా సంపద సృష్టిస్తూ పేదల కోసం ప్రకటించిన ప్రతి సంక్షేమ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Published : 04 Jun 2023 03:39 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్నివిధాలా సంపద సృష్టిస్తూ పేదల కోసం ప్రకటించిన ప్రతి సంక్షేమ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో శనివారం పార్టీ శ్రేణులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలులో భాగంగా అర్హులైన పిల్లలందరికీ (ఇంటిలో ఎంతమంది ఉంటే అంత మందికీ) ఎన్నికలకు ముందుగానే టోకెన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ అర్హులందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి కొందరికే పరిమితం చేశారని, నిబంధనల సాకుతో ఏటేటా కోత పెడుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని