కాంగ్రెస్ను ప్రజలు ఆదరించాలి
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు ఆదరించాలని, తమ పార్టీతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆశయాలు నెరవేరుతాయని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
న్యూజెర్సీ సమావేశంలో రేవంత్రెడ్డి
గాంధీభవన్, న్యూస్టుడే: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ప్రజలు ఆదరించాలని, తమ పార్టీతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆశయాలు నెరవేరుతాయని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూజెర్సీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ‘‘అనేక హామీలతో ప్రజలనునమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా పాలిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ దోపిడీని ఇంకెంత కాలం భరిద్దాం..? ప్రవాసాంధ్రులంతా కాంగ్రెస్తో కలిసి రావాలి’’ అని రేవంత్రెడ్డి కోరారు.
* ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై రేవంత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సోనియా, మీరాకుమార్లను కేసీఆర్ అవమానించారు: వీహెచ్
గాంధీభవన్, న్యూస్టుడే: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, లోక్సభలో బిల్లు పాస్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఆనాటి స్పీకర్ మీరాకుమార్ను సీఎం కేసీఆర్ అవమానించారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవ ప్రసంగంలో కేసీఆర్ వారిద్దరి పేర్లు ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు.
సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: అన్వేష్రెడ్డి
రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డితో కలిసి ఆయన శనివారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే 90 లక్షల ఎకరాలకు నీరందించారని, ఇప్పుడు దానికి అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వడం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్