ప్రతిపక్షాల ఐక్యతపై నమ్మకం ఉంది
ప్రస్తుతం భారత్ రెండు విభిన్న సిద్ధాంతాలపై పోరాటాన్ని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. అధికార భాజపాకు వ్యతిరేకంగా ‘ప్రత్యేక దృక్పథం’ కోసం దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు.
ప్రవాస భారతీయులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రాహుల్గాంధీ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రస్తుతం భారత్ రెండు విభిన్న సిద్ధాంతాలపై పోరాటాన్ని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. అధికార భాజపాకు వ్యతిరేకంగా ‘ప్రత్యేక దృక్పథం’ కోసం దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం వాషింగ్టన్లో ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. తాను కాంగ్రెస్సేతర ప్రతిపక్ష పార్టీలను కలిసిన ప్రతిసారి ‘మనం ఐక్యంగా పోరాడాలి’ అన్న విషయాన్ని నొక్కివక్కాణించే వాడినని పేర్కొన్నారు. ‘‘చాలా మంది మీడియా వ్యక్తులు భాజపా, ఆరెస్సెస్లను వాటి బలాన్ని పెద్దగా చూపాలని ఇష్టపడుతున్నారు. దయచేసి హిమాచల్ప్రదేశ్ ఎన్నికలను చూడండి. కర్ణాటక ఎన్నికలను చూడండి. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ల ఎన్నికలను గమనించండి. భాజపాను ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువని మీరు తెలుసుకుంటారు’’ అని పేర్కొన్నారు. ‘‘దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరు కొనసాగుతోంది. ఒకటేమో శాంతి, అహింస, సత్యం, నిరాడంబరతలతో కూడిన మహాత్మా గాంధీ దృక్పథం. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలంతా దేశ పురోగతిలో సమాన భాగస్థులు అనే దృక్పథం’’ అని చెప్పారు. అదే సమయంలో ‘‘విభజన దురహంకారం, శాస్త్రీయతలేని దుందుడుకుతనంతో ఆర్ఎస్ఎస్ ద్వారా పోరాడే దృక్పథం మరొకటి. ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానితో మరొకటి పోరాడుతున్నాయి. హింసాత్మకంగా, విద్వేషపూరితంగా ఉండడం మన లక్షణం కాదు. గాంధీ దృక్పథం త్వరలోనే విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉంది’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్