గుత్తేదారుల జేబులు నింపేందుకే ప్యాకేజీ-21 రీడిజైన్
నాయకులు, గుత్తేదారుల జేబులు నింపేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-21లోని మంచిప్ప జలాశయ నిర్మాణాన్ని రీడిజైన్ చేసి రూ.కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
నిజామాబాద్ గ్రామీణం, మంచిప్ప, న్యూస్టుడే: నాయకులు, గుత్తేదారుల జేబులు నింపేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-21లోని మంచిప్ప జలాశయ నిర్మాణాన్ని రీడిజైన్ చేసి రూ.కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మోపాల్, డిచ్పల్లి మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. మంచిప్పలోని కొండెం చెరువుపై 1.5 టీఎంసీల సామర్థ్యంతో అప్పట్లో జలాశయం నిర్మించడానికి రూ.1100 కోట్లు అంచనా వేస్తే.. భారాస సర్కారు రీడిజైన్ పేరుతో 3.5 టీఎంసీలకు, రూ.3,500 కోట్లకు బడ్జెట్ పెంచిందన్నారు. దీని వల్ల 3 గ్రామాలు, 9 తండాలు ముంపునకు గురవుతాయన్నారు. భూములు కోల్పోతున్న గిరిజనులు, ప్రజలు పోరాడుతోంటే వారిపై దౌర్జన్యంగా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM