మోదీజీ.. రైల్వే రక్షణ మీద దృష్టేది?
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.
ప్రధానిని నిలదీసిన మల్లికార్జున ఖర్గే
దిల్లీ: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. కొత్త రైళ్ల ప్రారంభంపై ఆసక్తి చూపే ప్రధాని రైల్వే రక్షణపై దృష్టి సారించడంలేదని ఆక్షేపించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి నుంచి కింది వరకూ అన్ని ఉద్యోగాల్లోనూ జవాబుదారీతనాన్ని నెలకొల్పాలని వరుస ట్వీట్లలో సూచించారు. రైల్వేలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, చివరికి ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా భర్తీ కావలసిన ఉన్నత స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో వీటిని ఎందుకు భర్తీ చేయలేదో తెలపాలని డిమాండ్ చేశారు. అవసరమైనంత మంది సిబ్బంది లేకపోవడంతో లోకో పైలట్లు ఎక్కువ సమయం పనిచేయాల్సిరావడం ప్రమాదాలకు కారణమవుతోందని రైల్వే బోర్డు పేర్కొనడాన్ని ఖర్గే ప్రస్తావించారు. రైల్వే భద్రత కమిషన్ సిఫారసులను రైల్వే బోర్డు పరిగణనలోకి తీసుకోకపోవడంపై రైల్వేలపై ఏర్పాటైన పార్లమెంటు స్థాయి సంఘం తన 323వ నివేదికలో విమర్శించిన సంగతిని ఖర్గే ఉటంకించారు.
ప్రధాని.. అశ్వినీ వైష్ణవ్ రాజీనామాను కోరాలి
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణం కోరాలి. 270 మందికి పైగా చనిపోయినప్పటికీ జవాబుదారీతనం కనిపించడంలేదు. ఇంతటి విషాదకర ప్రమాదానికి బాధ్యత వహించకుండా మోదీ ప్రభుత్వం తప్పించుకోలేదు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
నైతిక బాధ్యత తీసుకోవాలి
నైతిక బాధ్యతతో గతంలో రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి, నీతీశ్ కుమార్, మాధవ్రావ్ సింధియాలను ప్రస్తుత రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ అనుసరించాలి. ఆయన తప్పక తన పదవిని వదిలిపెట్టాలి.
ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలి. మంత్రి ప్రచార గిమ్మిక్కులతో భారతీయ రైల్వేలోని తీవ్రమైన లోపాలు, నేరపూరితమైన నిర్లక్ష్యం, భద్రత లొసుగులు మరుగునపడిపోయాయి. తాజా విషాదఘట్టంలో తన బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించాలి.
పవన్ ఖేడా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఒక్క మంత్రికి అన్ని పెద్ద శాఖలా?
కేంద్ర ప్రభుత్వంలో అశ్వినీ వైష్ణవ్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా, రైల్వే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒక్క మంత్రి అన్ని భారీ శాఖలు నిర్వహించలేరు. రైల్వే బడ్జెట్ లేదు. జవాబుదారీతనం లేదు. రైల్వే భద్రత కోసం ఏటా రూ.అయిదు వేల కోట్లను కేటాయించలేకపోతున్నారు.
కపిల్ సిబల్, రాజ్యసభ సభ్యుడు
కాగ్ సిఫారసులు అమలు పరచలేదేం?
దేశంలో రైలు ప్రమాదాల నివారణకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022లో చేసిన సిఫారసులను ఎందుకు అమలు పరచలేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయడానికి ఆ నిర్లక్ష్యం చాలదా?
క్లిడే క్రాస్టో, ఎన్సీపీ అధికార ప్రతినిధి
రాజకీయం చేయొద్దు
దురదృష్టవశాత్తూ జరిగిన ఒడిశా రైలు ప్రమాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు. ప్రస్తుతం మమల్ని సహాయ, ఉపశమన కార్యక్రమాలు చేపట్టనివ్వండి. అలాగే ఆ మార్గంలో తిరిగి రైళ్లు నడిచేలా పనులు చేయనివ్వండి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు గొప్పదేమీ కాదు. అలాంటివారు అత్యంత అర్హత కలిగిన రైల్వే మంత్రి రాజీనామాను కోరుతున్నారు.
అమిత్ మాలవీయ, భాజపా ఐటీ విభాగాధిపతి
నా హృదయం ముక్కలైంది
భారత్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విని నా హృదయం ముక్కలైంది. జిల్ బైడెన్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక ఘటన వల్ల ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది.
జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?