రాష్ట్రాన్ని దోచుకుంటున్న భారాస
రాష్ట్రాన్ని భారాస దోచుకుంటోందని, ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సత్తుపల్లి, న్యూస్టుడే: రాష్ట్రాన్ని భారాస దోచుకుంటోందని, ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్డు శివారులో వివాదాస్పదంగా మారిన భూమిని సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘కాకర్లపల్లిలో 30 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని, పన్నులు చెల్లిస్తున్న పేదలకు అధికారులు అన్యాయం చేస్తున్నారు. బాధితులను రక్షించాల్సిన సత్తుపల్లి ఎమ్మెల్యే... భూకబ్జాదారులకు పరోక్షంగా మద్దతివ్వడం సరికాదు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకుంటే మళ్లీ లీకేజీలు జరిగే ప్రమాదముంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కో ప్రభుత్వ ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోం’’ అని స్పష్టంచేశారు. ఆయన వెంట నాయకులు బి.ఉపేంద్రసాహూ, శీలం వెంకటేశ్వరరావు, సుదర్శన్, సుభానీ, శ్రీనివాసరావు, ఈదర చంటి, చంద్రమోహన్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ