Vallabhaneni Vamsi: పంతం నెగ్గించుకున్న గన్నవరం ఎమ్మెల్యే!
‘ఆయనకు నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఎకరా రూ.1.5 కోట్లు. అంటే మొత్తం విలువ రూ.6 కోట్లు. గన్నవరంలో మరో ఫ్లాట్ ఉంది.
తెదేపా నేత డీఫారం పట్టా రద్దు, భూమి స్వాధీనం
కోర్టుకు సెలవు రోజుల్లో ఆగమేఘాలపై చర్యలు
ఈనాడు, అమరావతి: ‘ఆయనకు నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఎకరా రూ.1.5 కోట్లు. అంటే మొత్తం విలువ రూ.6 కోట్లు. గన్నవరంలో మరో ఫ్లాట్ ఉంది. దాని విలువ రూ.50 లక్షలు. మరో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారు. ఆయనకు డీఫారం పట్టా ఇవ్వడం సరికాదు’.. ఇదీ 1999లో ఇచ్చిన డీఫారం పట్టా రద్దు కోసం జిల్లా మెజిస్ట్రేట్, కృష్ణా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు. ఈ ఉత్తర్వులు జారీ కావడమే తరువాయి సోమవారం సాయంత్రం గన్నవరం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆ పొలంపైకి పొక్లెయిన్లతో వెళ్లి, షెడ్డును కూల్చేసి స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ కక్షతోనే గన్నవరం మండల తెదేపా అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరావు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా వెదురుపావులూరులో జాస్తి వెంకటేశ్వరరావుకు సర్వేనెంబరు 308/4లో 99 సెంట్ల పొలం ఉంది. ఇది డి పట్టా. దీనిని 1999లో జాస్తి రాజేశ్వరమ్మ పేరుతో వెంకటేశ్వరరావు తల్లికి ప్రభుత్వం ఇచ్చింది. వారసత్వం ప్రకారం తల్లి నుంచి ఆయనకు సంక్రమించగా.. రెవెన్యూ అధికారులే వెంకటేశ్వరరావు పేరిట మార్చారు. 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైకాపాకు మద్దతు పలికారు. అధికారాన్ని ప్రయోగించి పలువురిని తనవైపు తిప్పుకొనేందుకు యత్నించగా, వెంకటేశ్వరావు వెళ్లలేదు. తెదేపాలోనే క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో ఈ డి-ఫారం పట్టాను తెరపైకి తెచ్చారు. ఈ స్థలం విజయవాడ బైపాస్ పక్కనే ఉండగా కూరగాయలు సాగు చేస్తున్నారు. దీనిని స్వాధీనం చేసుకోవాలనే ఒత్తిడి పెరిగింది.
అంతా పక్షం రోజుల్లోనే!
మే 18న జాస్తి భూమిలోకి ఎమ్మెల్యే వంశీ మందీమార్బలంతో వెళ్లారు. ఇది ప్రభుత్వ భూమి అనీ, స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై అప్పటికే హైకోర్టు ఇన్జక్షన్ ఆర్డరు ఉంది. తర్వాత హైకోర్టు న్యాయపరంగా వెళ్లాలని ఆదేశాలిచ్చి పిటిషన్ను మూసివేసింది. దీంతో వెంకటేశ్వరరావుకు నోటీసు జారీచేశారు. దీనిపై ఆయన గన్నవరం తహసీల్దారుకు పట్టా, అడంగళ్ సమర్పించారు. తమకు డీఫారం పట్టా ఇచ్చేనాటికి అనాధీనం భూమిగానే ఉందని ఆధారాలు సమర్పించారు. తర్వాత ఆర్డీవో విచారణ చేపట్టారు. డీఫారం పట్టాపై కాకుండా వెంకటేశ్వరరావు ఆస్తులపై ఆరా తీసి వివిధ అంశాలను నివేదించారు. 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, వర్గీకరణ ప్రకారం రాజేశ్వరమ్మకు కేటాయించిన భూమి.. సురాయి చెరువు, డొంకగా ఉందని, ఇది సుప్రీం తీర్పునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆక్రమించారని ప్రస్తావించిన నాలుగు ఎకరాల భూమి విలువగానీ, అది ఎక్కడ ఉందనేదిగానీ పేర్కొనలేదు. దీని స్వాధీనంపై ఎలాంటి వివరణా లేదు. ప్రస్తుతం న్యాయస్థానాలకు వేసవి సెలవులు కావడంతో ఆ అవకాశం లేకుండా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం, నాలుగో తేదీనే తహసీల్దార్ వాటిని జారీ చేయడం, సోమవారం స్వాధీనం చేసుకుని, పొక్లైన్ ప్రయోగించడం జరిగిపోయాయి.
ఇదేం తీరు?
1999లో తన తల్లికి ఇచ్చిన 99 సెంట్ల స్థలానికి.. తాను కష్టార్జితంతో సంపాదించిన భూమికి సంబంధం ఏంటని జాస్తి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ‘అంటే.. పేదలు పేదలుగానే ఉండాలా? పేదలు ఆస్తిపరులైతే గతంలో ఇచ్చిన భూములు, సంక్షేమ ఫలాలు తిరిగి లాక్కోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? ఈ భూమిపై ఓలుపల్లి మోహనరంగారావు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు. ఇతని తండ్రి తాతారావు. కానీ కలెక్టర్ ఆదేశాల్లో ఓచోట జాస్తి వెంకటేశ్వరరావు తండ్రి తాతారావుగా పేర్కొన్నారు. డీఫారం పట్టా రద్దు చేసింది వెంకటేశ్వరరావు అక్రమంగా పొందారనా? లేక నీటివనరులు, డొంక భూమి కేటాయించారనా అనేది స్పష్టత లేదు. నేను పార్టీ మారనందునే ఎమ్మెల్యే ఇలా వ్యవహరించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడతామ’ని జాస్తి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు