సహకార డెయిరీలపై ప్రభుత్వం కక్ష
రాష్ట్రంలో పాడి రైతులు, సహకార డెయిరీ ప్రయోజనాలకన్నా గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీ ప్రయోజనాలే వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు.
అమూల్ను పాడి రైతులు అడ్డుకోవాలి
సంగం డెయిరీ ఛైర్మన్ నరేంద్ర కుమార్
వడ్లమూడి(చేబ్రోలు), న్యూస్టుడే: రాష్ట్రంలో పాడి రైతులు, సహకార డెయిరీ ప్రయోజనాలకన్నా గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీ ప్రయోజనాలే వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోని డెయిరీ ఆవరణలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోర్డు సమావేశంలో పాడి రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నరేంద్రకుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలు, సంస్థలు, వ్యవస్థల ప్రయోజనాలకంటే గుజరాత్కు చెందిన సంస్థల కోసమే పని చేస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వం అమూల్ సంస్థకు ప్రజల సొమ్మును దోచి పెడుతోందని విమర్శించారు. పాడి రైతుల వ్యతిరేక చర్యలకు సంగం డెయిరీ అడ్డుగా ఉంటోందని భావించే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థ కోసం రూ.3 వేల కోట్ల నిధులు ఖర్చు చేసిందని, దీనిపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కర్ణాటకలో అమూల్ డెయిరీ వద్దని అక్కడ ప్రజలు నిరసన తెలిపారని, తమిళనాడు సీఎం స్టాలిన్ అమూల్ ప్రవేశాన్ని ఆపాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారన్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రజలు నిరసన తెలియజేయడం ద్వారా రాష్ట్రంలోని సహకార డెయిరీలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. లీటరుకు 4రూపాయలు పశుపోషకులకు అదనంగా ఇస్తామని చెప్పి నాలుగేళ్లయినా రూపాయి కూడా ఇవ్వకపోగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డెయిరీల ఆస్తులను ప్రభుత్వం అమూల్ కోసం కేటాయించడం దారుణమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్