‘చేయి’పట్టి నడుస్తారా?..జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ వైపే మొగ్గు!
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలిసింది.
రాహుల్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఖరారు
కొనసాగుతున్న భాజపా యత్నం
ఈనాడు హైదరాబాద్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. రాహుల్గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత చేరికలుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇటీవలే వీరిద్దరినీ కలిసి చర్చించినట్లు సమాచారం. మరోవైపు భాజపా కూడా ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ రెండురోజుల క్రితం ఈ అంశంపై చేరికల కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న ఈటల రాజేందర్తో చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. భారాస నుంచి పొంగులేటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు బయటకు వచ్చారు. అలాగే మాజీ మంత్రి, కొల్లాపూర్ నుంచి 2018 ఎన్నికలకు ముందు వరుసగా గెలుపొందిన జూపల్లితో పాటు ఆయన అనుచరులు కూడా భారాసకు గుడ్బై చెప్పారు. పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వంపైన, భారాసపైన విమర్శలు గుప్పించారు. కొల్లాపూర్లోనూ సమావేశం జరిగింది. వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలో చేరడానికి నిర్ణయించుకోగా, వీరితో సన్నిహిత సంబంధాలున్న ఈటల రాజేందర్ భాజపాలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
కానీ ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, అక్కడ భారాసకు కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండడడం, భాజపా ప్రభావం తక్కువగా ఉండటం తదితర కారణాలతో కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలూ దీనికి దోహదపడ్డాయి. పొంగులేటి, జూపల్లి... కొత్తపార్టీ ఆలోచన కూడా చేశారు. వీటన్నిటిపైనా పలు దఫాలుగా చర్చించుకున్న తర్వాత అటు ఉమ్మడి ఖమ్మం, ఇటు కొల్లాపూర్లోని స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్లోనే చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నాయకత్వం కూడా వీరిని చేర్చుకోవడానికి, తగిన ప్రాధాన్యమివ్వడానికి మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సునీల్ కనుగోలుతో జరిగిన చర్చల్లో నియోజకవర్గాలు, అభ్యర్థులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. గెలవడానికి అవకాశ మున్న అభ్యర్థులనే పోటీకి నిలపాలనే అంశంపైనా వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్గాంధీతో నేరుగా కలిసి మాట్లాడిన తర్వాత వారు పార్టీలో చేరే తేదీ ఖరారు కానుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, అటు నుంచే యూరప్ వెళ్లి ఈ నెల 21న తిరిగి రానున్నట్లు తెలిసింది. ఆయన వచ్చిన తర్వాత నేరుగా భేటీ అయ్యి అన్ని అంశాలను చర్చించిన తర్వాత చేరిక తేదీని ఖరారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈలోగా ఏవైనా మార్పులు జరుగుతాయా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే భాజపాలో చేరిన కిరణ్కుమార్రెడ్డి కూడా పొంగులేటి, జూపల్లితో సమావేశమై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సమావేశం తర్వాతే సునీల్ బన్సల్ ఈటలకు సూచనలిచ్చినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి.