తెదేపా జడ్పీటీసీ సభ్యుడిపై వైకాపా నాయకుడి దాడి
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని సండ్రపల్లెలో మంగళవారం గోపవరం తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డి, ఆయన అక్క, బావ కృష్ణమ్మ, రమణారెడ్డిలపై వైకాపా నాయకుడు సుబ్బరాయుడు అలియాస్ సుబ్బారెడ్డి దాడిచేసి గాయపరిచాడు.
బాధితుడితో పాటు ఆయన అక్కాబావలకు గాయాలు
వైయస్ఆర్ జిల్లాలో సంఘటన
బద్వేలు, న్యూస్టుడే: వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని సండ్రపల్లెలో మంగళవారం గోపవరం తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డి, ఆయన అక్క, బావ కృష్ణమ్మ, రమణారెడ్డిలపై వైకాపా నాయకుడు సుబ్బరాయుడు అలియాస్ సుబ్బారెడ్డి దాడిచేసి గాయపరిచాడు. క్షతగాత్రులకు తొలుత బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందించి కడప రిమ్స్కు తరలించారు. బద్వేలు గ్రామీణ ఎస్సై చంద్రశేఖర్ వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజామున మద్యం తాగిన సుబ్బరాయుడు అలియాస్ సుబ్బారెడ్డి.. జయరామిరెడ్డి ఇంటి వద్దకు కర్రతో వెళ్లాడు. నిద్రిస్తున్న జయరామిరెడ్డిపై, జయరామిరెడ్డి అక్క బావ కృష్ణమ్మ, రమణారెడ్డిలపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. గ్రామీణ పోలీసులు సండ్రపల్లెకు వెళ్లి సుబ్బరాయుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గోపవరం జడ్పీటీసీ స్థానంలో వైకాపాకు గట్టి పోటీనిచ్చి తెదేపా తరఫున జయరామిరెడ్డి గెలిచారు. రాజకీయంగా దీనిని జీర్ణించుకోలేక వైకాపాకు చెందిన నాయకులు దాడికి ఉసిగొల్పినట్లు తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM