తెదేపా జడ్పీటీసీ సభ్యుడిపై వైకాపా నాయకుడి దాడి

వైయస్‌ఆర్‌ జిల్లా గోపవరం మండలంలోని సండ్రపల్లెలో మంగళవారం గోపవరం తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డి, ఆయన అక్క, బావ కృష్ణమ్మ, రమణారెడ్డిలపై వైకాపా నాయకుడు సుబ్బరాయుడు అలియాస్‌ సుబ్బారెడ్డి దాడిచేసి గాయపరిచాడు.

Published : 07 Jun 2023 03:37 IST

బాధితుడితో పాటు ఆయన అక్కాబావలకు గాయాలు
వైయస్‌ఆర్‌ జిల్లాలో సంఘటన

బద్వేలు, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా గోపవరం మండలంలోని సండ్రపల్లెలో మంగళవారం గోపవరం తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డి, ఆయన అక్క, బావ కృష్ణమ్మ, రమణారెడ్డిలపై వైకాపా నాయకుడు సుబ్బరాయుడు అలియాస్‌ సుబ్బారెడ్డి దాడిచేసి గాయపరిచాడు. క్షతగాత్రులకు తొలుత బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందించి కడప రిమ్స్‌కు తరలించారు. బద్వేలు గ్రామీణ ఎస్సై చంద్రశేఖర్‌ వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజామున మద్యం తాగిన సుబ్బరాయుడు అలియాస్‌ సుబ్బారెడ్డి.. జయరామిరెడ్డి ఇంటి వద్దకు కర్రతో వెళ్లాడు. నిద్రిస్తున్న జయరామిరెడ్డిపై, జయరామిరెడ్డి అక్క బావ కృష్ణమ్మ, రమణారెడ్డిలపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. గ్రామీణ పోలీసులు సండ్రపల్లెకు వెళ్లి సుబ్బరాయుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గోపవరం జడ్పీటీసీ స్థానంలో వైకాపాకు గట్టి పోటీనిచ్చి తెదేపా తరఫున జయరామిరెడ్డి గెలిచారు. రాజకీయంగా దీనిని జీర్ణించుకోలేక వైకాపాకు చెందిన నాయకులు దాడికి ఉసిగొల్పినట్లు తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని