కేసు వద్దు.. శవపరీక్షా వద్దు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలోదారుణ హత్యకు గురైన తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ భార్య, అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ మృతదేహానికి పోస్టుమార్టం విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
న్యాయం జరగదంటూ తెదేపా శ్రేణుల ఆందోళన
హనుమాయమ్మ హత్యోదంతంలో ఉద్రిక్త పరిస్థితులు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలోదారుణ హత్యకు గురైన తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ భార్య, అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ మృతదేహానికి పోస్టుమార్టం విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెదేపా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఒంగోలు జీజీహెచ్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. హత్య చేశాక నిందితుడు గ్రామంలోనే ఉన్నా.. అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. ఈ డిమాండ్లతో కలెక్టరేట్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే జీజీహెచ్ పరిసరాల్లో మోహరించి ఉన్న పోలీసులు వైద్యశాలలోకి వెళ్లే ప్రధాన ద్వారాలను మూసేసి తెదేపా కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అధికారులనే వైద్యశాల వద్దకు రప్పిస్తామని పోలీసులు సర్దిచెప్పినా ఆందోళనకారులు అంగీకరించలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్డీవో విశ్వేశ్వరరావు, అధికారులు అక్కడికి చేరుకోగా.. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లింపుపై స్పష్టమైన హామీనివ్వాలని తెదేపా నేతలు ఆనందబాబు, స్వామి డిమాండు చేశారు. కలెక్టర్ వద్దే విషయం తేల్చుకుంటామని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి, సీఎం జగన్కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినదించారు. న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని, కేసు ఉపసంహరించుకుంటామని, పోస్టుమార్టం చేయొద్దని అన్నారు. మృతదేహాన్ని అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు సముదాయిస్తూ పోస్టుమార్టం చేసి అప్పగిస్తామనడంతో శాంతించారు. ఎట్టకేలకు రాత్రి ఎనిమిదింటికి శవపరీక్ష పూర్తి చేశారు.
వ్యూహాత్మకంగానే జాప్యం
మరుగుదొడ్ల నిర్మాణంలో తెదేపాకు చెందిన ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి రూ.కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ వైకాపా కొండపి నియోజకవర్గ కన్వీనర్ అశోక్బాబు ఆధ్వర్యంలో చెంబు మార్చ్ పేరిట ఆందోళనకు సిద్ధమయ్యారు. దీన్ని ప్రతిఘటిస్తూ తెదేపా ‘చలో టంగుటూరు’ చేపట్టింది. అధికార, విపక్షాలు పోటాపోటీ ఆందోళనలకు పిలుపునిచ్చినా నిలువరించటంలో పోలీసులు విఫలమయ్యారు. దరిమిలా టంగుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఈ తీవ్రత కొనసాగుతుండగానే హనుమాయమ్మ హత్యకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నంనుంచి ఆమె మృతదేహం ఒంగోలు జీజీహెచ్ శవాగారంలోనే ఉన్నప్పటికీ అధికారులు వ్యూహాత్మకంగానే పరీక్ష జాప్యం చేశారన్న విమర్శలున్నాయి.
ఎమ్మెల్యే స్వామిపై రెండు కేసులు
కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై టంగుటూరు పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం చేసినట్లు ఓ కేసు... నియమావళిని ఉల్లంఘించి జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారన్న విషయమై మరో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి