నింగిలో చుక్కలు కాదు.. నీటి చుక్కలూ ఇవ్వలేరా?
చంద్రుడిని, నక్షత్రాలను వదిలేయండి.. మాకు నీళ్లు, కరెంటు ఇవ్వండి) అని 75 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న కేంద్ర పాలకులను అడుగుతున్నా ఇవ్వలేకపోతున్నారు’’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎద్దేవా చేశారు
కేంద్ర పాలకులను నిలదీసేందుకు ప్రతి పౌరుడూ జాగృతం కావాలి
భారాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి భారాసలోకి చేరికలు
ఈనాడు, హైదరాబాద్: ‘‘మనమేమన్నా వాళ్లను చంద్రుడిని, చుక్కలను తెచ్చి ఇమ్మంటున్నమా? మన జీవితానికి అత్యవసరమైన, ప్రకృతిలో అందుబాటులో ఉన్న తాగునీటిని, సాగు నీటిని, విద్యుత్ను మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాం. చాంద్ సితారో చోడో.. పానీ బిజిలీ జోడో (చంద్రుడిని, నక్షత్రాలను వదిలేయండి.. మాకు నీళ్లు, కరెంటు ఇవ్వండి) అని 75 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న కేంద్ర పాలకులను అడుగుతున్నా ఇవ్వలేకపోతున్నారు’’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎద్దేవా చేశారు. అందుబాట్లో ఉన్న వాటిని పొందేందుకు నిలదీసే దిశగా ప్రతి దేశ పౌరుడూ జాగృతం కావాల్సిన అవసరముందని అన్నారు. బుధవారం మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వందల మంది నేతలు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నపుడు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలకు చెందిన 50 మంది సర్పంచులు కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. వారు పార్టీలో చేరడానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. తమ గ్రామాల్లో కూడా తెలంగాణ మోడల్ పాలన అమలు కావాలనే ఆంకాంక్షతో తాము భారాసలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
భారాసలో చేరిన మధ్యప్రదేశ్ సామాజిక కార్యకర్త
ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్లో సంచలనం రేపిన వ్యాపమ్ స్కామ్ను వెలుగులోకి తెచ్చిన ఆనంద్రాయ్ బుధవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సమక్షంలో భారాసలో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తగా, గిరిజన హక్కుల ఉద్యమకారుడిగా ఆనంద్రాయ్ ఆ రాష్ట్రంలో ప్రజల ఆదరాభిమానాలు పొందారు. మధ్యప్రదేశ్లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ‘జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ (జేఏవైఎస్)’ అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక కూడా భారాసకు మద్దతు ప్రకటించింది. ఆనంద్రాయ్ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు పలువురు భారాసలో చేరారు. కేసీఆర్ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారనే విశ్వాసం దేశవ్యాప్తంగా కలుగుతోందని జేఏవైఎస్ వ్యవస్థాపకుడు విక్రమ్ అచ్చాలియా అన్నారు. ఈ సందర్భంగా సంస్థ జెండాను ఆయన కేసీఆర్కు కప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి