Nara Lokesh: సీమ రూపురేఖలు మారుస్తాం
అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో రాయలసీమ రూపురేఖలు మారుస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.
‘మిషన్ రాయలసీమ’ సభలో నారా లోకేశ్
ఈనాడు, కడప: అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో రాయలసీమ రూపురేఖలు మారుస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. బుధవారం వైయస్ఆర్ జిల్లా కడప నగరంలో ‘మిషన్ రాయలసీమ’ పేరుతో జరిగిన బహిరంగ సభలో చర్చా వేదిక నిర్వహించారు. ప్రొఫెసర్ రాజేశ్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ప్రముఖులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్గ్రిడ్ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం... మిషన్ రాయలసీమలో అంతర్భాగాలుగా ఉన్నాయి...’ అని వివరించారు. ‘రాయలసీమకు అండగా నిలబడింది పసుపు జెండా.. తెలుగుగంగ నుంచి హంద్రీ- నీవా వరకు ప్రాజెక్టులను తెచ్చి సీమ ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీర్చడానికి కృషి చేసిందన్నారు. సీమకు కియా, ఫ్యాక్స్ కాన్, టీసీఎల్ వంటి పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించామని చెప్పారు. పలు ప్రశ్నలకు ముఖాముఖిలో లోకేశ్ సమాధానాలిచ్చారు. వివరాలు...
ప్రశ్న: నాయకుడు లోకేశ్ అని ఎప్పుడు అనిపించుకుంటారు?
లోకేశ్: అన్ని వర్గాల ప్రజలు తమను ప్రభుత్వం వేధిస్తోంది. మీరు రోడ్డు మీదకు రండని పిలిచిన తర్వాతే పాదయాత్రను ప్రారంభించాం. కుటుంబానికి దూరంగా ఉంటూ పాదయాత్ర చేయడానికి ప్రజల బలం, ప్రోత్సాహం కారణం. రాయలసీమ ప్రజలు ఆదరించారు. దాడుల్ని తిప్పికొట్టారు. ప్రజల మనసు గెలుచుకున్న తర్వాత లోకేశ్ నిజమైన నాయకుడు అవుతాడు.
రాయలసీమ అంటే రౌడీయిజం, ఫ్యాక్షనిజం అన్న ముద్రలు వేశారు? 119 రోజుల్లో సీమపై మీకు కలిగిన భావన ఏమిటి?
సీమ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ. ఇంటికి ఎవరైనా వస్తే అప్పు తెచ్చైనా అతిథుల ఆకలి తీరుస్తారు. పాదయాత్రలో దీనిని ప్రత్యక్షంగా చూశాను.
పాదయాత్రలో మీకు బాధ కలిగించిన ఘటన ఏది?
గంగాధర్ నెల్లూరులో మోహన అనే మహిళ చిన్న హోటల్ పెట్టుకుని ఇద్దరు బిడ్డలను చదివించింది. వారికి ఉద్యోగాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగితే... పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని అడిగింది. చాలా బాధేసింది. బిడ్డలను చదివించుకుని.. ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పడుతోంది.
లేపాక్షి భూముల్ని లాక్కొని ఉద్యోగాలిస్తామని ఇవ్వడం లేదు?
లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూములు కేటాయించి 16 ఏళ్లు అయింది. మరో ఏడాదిలో తెదేపా వస్తుంది. ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తాం. ఈ భూమిపై అప్పు తీసుకుని బ్యాంకుకు కట్టకుండా ఐపీ పెట్టారు. రూ.500 కోట్లకు సీఎం తన బంధువులకు కట్టబెట్టాలని చూశారు. మేము పోరాడిన తర్వాత వెనక్కి తగ్గారు.
తాగు, సాగునీరు లేక అవస్థలు పడుతున్నాం?
2014లో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. కొన్ని 30 శాతం నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం పనులు పక్కనబెట్టింది. పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణ కూడా లేక విద్యుత్తు బిల్లు కూడా కట్టడం లేదు. పట్టిసీమ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు నీళ్లిచ్చాం. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చాం. రూ.22 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాం. ఈ ప్రభుత్వం నిలిపేసింది. తెదేపా అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు సాగునీటి కాల్వలు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
* జగన్ వచ్చాక 4 ఏళ్లలో సీమ 30 ఏళ్లు వెనక్కి పోయింది. మహిళలు బిందెలు పట్టుకుని నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. పద్మావతి అనే చెల్లి పెనుగొండలో పాదయాత్రలో నన్ను కలిసి కియా అనుబంధ సంస్థల్లో పని చేస్తున్నానని చెప్పింది. దానికి కారణం చంద్రబాబు అని చెప్పింది. కుటుంబానికి పరిమితమైన మహిళ.. ఇంటిని నడిపించే స్థాయికి వెళ్లింది.
* పేదవాళ్లకు ఇచ్చిన సెంటు ఇళ్ల స్థలాల్లో రూ.7 వేల కోట్ల అవినీతి జరిగిందని లోకేశ్ ఆరోపించారు. ఈ మొత్తాన్ని అధికారంలోకి రాగానే తిరిగి రాబడతామన్నారు.
* పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం చెక్కును లోకేశ్కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
అమరావతి భాజపా అభ్యర్థిగా నవనీత్ రాణా
మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్ రాణాకు భాజపా లోక్సభ టికెట్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186