Nara Lokesh: సీమ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా..
‘‘కుప్పం నుంచి కడప వరకు.. 119 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,516 కి.మీ. పాదయాత్ర చేశా. ఈ సుదీర్ఘ యాత్రలో సీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూశాను.
ప్రతి ఎకరాకూ సాగునీరిస్తాం
ఉద్యాన హబ్గా తయారు చేస్తాం
90% రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలు
క్రీడాకారులకు స్పోర్ట్స్ వర్సిటీ ‘మిషన్ రాయలసీమ’తో సమగ్రాభివృద్ధి చేస్తాం
డిక్లరేషన్ వెల్లడించిన నారా లోకేశ్
ఈనాడు, కడప: ‘‘కుప్పం నుంచి కడప వరకు.. 119 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,516 కి.మీ. పాదయాత్ర చేశా. ఈ సుదీర్ఘ యాత్రలో సీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూశాను. అందరి కన్నీళ్లు తుడుస్తాను. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తాను. అందుకే ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ‘మిషన్ రాయలసీమ’ ప్రకటిస్తున్నా..’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన కడపలో మిషన్ రాయలసీమ పేరుతో జరిగిన సభలో రాయలసీమ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు. ‘తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలోనే వాటన్నింటిని స్వయంగా నేనే నెరవేరుస్తా.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా.. లేదంటే నన్ను నిలదీయండి...’ అని లోకేశ్ పేర్కొన్నారు. ‘2019లో సీమలోని 52 సీట్లలో 49 స్థానాల్లో వైకాపాను గెలిపించారు. ఏమైనా ప్రయోజనం ఉందా?. మీ కన్నీళ్లు తుడవాలంటే వైకాపాకు ఇచ్చిన సంఖ్యా బలాన్ని తెదేపాకు ఇవ్వండి...’ అని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ నలుమూలల నుంచి పెద్దఎత్తున మేధావులు, నేతలు తరలివచ్చిన ఈ సభలో సీమ సమస్యలపై విస్తృతస్థాయిలో చర్చా వేదిక నిర్వహించారు.
డిక్లరేషన్లోని ప్రధానాంశాలు..
ఉద్యాన పంటల హబ్గా రాయలసీమ
* సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం.
* వలస కూలీలకు ఉపశమనం కల్పిస్తాం.
* మామిడి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, అరటి తదితర పంటల సాగు పెంచడానికి ప్రోత్సాహం ఇస్తాం.
* 90% రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలిస్తాం.
* ఉద్యాన పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
* టమాటాకు వాల్యూ చైన్ ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం.
* గుజ్జు పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం.
* మిర్చి, పసుపు కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
* ఉద్యాన పంటలను ఉపాధి హామీకి అనుసంధానిస్తాం.
రైతుకు అండగా నిలుస్తాం
* తెదేపా అధికారంలోకి రాగానే.. రూ.20 వేలు చొప్పున ఇస్తాం.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్, డిమాండ్కు అనుగుణంగా వంగడాలను అందుబాటులోకి తెస్తాం.
* వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల్ని రాష్ట్రంలోనే తయారు చేసి.. తక్కువ ధరతో రాయితీపై అందిస్తాం.
* నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరల్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం.
* రాష్ట్రాన్ని విత్తన హబ్గా తయారు చేస్తాం.
* వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పంటలు వేయాలో ప్రభుత్వం నుంచి సలహాలిస్తాం.
* పంటలకు పాత బీమా పథకాన్ని అమలు చేస్తాం.
* రైతుబజార్ల సంఖ్య పెంచుతాం.
* కౌలు రైతులను గుర్తించి.. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాయం అందిస్తాం.
పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు
* పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తాం.
* పశువుల కొనుగోలు దగ్గర నుంచి దాణా, మందులు వరకు అన్నీ రాయితీపై అందిస్తాం.
* గోకులాల ఏర్పాటు. గొర్రెలు, మేకలు పెంపకం కోసం ప్రత్యేక సాయం.
* పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు పంపిణీ.
* వాటి మేత కోసం బంజరు భూముల కేటాయింపు.
* పాడిరైతులకు రాయితీపై రుణాలు అందచేత.
ఇంటింటికి తాగునీరు
* వాటర్ గ్రిడ్ ఏర్పాటు.
* భవిష్యత్తుకు హామీ ద్వారా సీమలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడం.
ధరల్ని తగ్గిస్తాం
* పన్నులను ప్రక్షాళన చేస్తాం.
* పెట్రోలు, డీజిల్ ధరల్ని తగ్గించే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. వాటి ధరలు తగ్గితే నిత్యావసరాల ధరలు కూడా తగ్గుతాయి.
పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగులకు ఉపాధి
* ఆటో, ఎలక్ట్రానిక్, డిఫెన్స్ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం.
* మైనింగ్ కంపెనీలు తెచ్చే బాధ్యత తీసుకుంటాం.
* మైనింగ్ తుది ఉత్పత్తి వరకు పూర్తి వాల్యూ చైన్ ఏర్పాటు.
* మైనింగ్ పనులు మనం రాష్ట్రం వాళ్లే చేసేలా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం.
* స్వయం ఉపాధికి రాయితీలు పెంచుతాం.
* సీమ జిల్లాలను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు చిరునామాగా మారుస్తాం.
* బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి.
* ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా యువతకు ఉపాధి.
* లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకుని పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తాం.
సీమలో స్పోర్ట్స్ యూనివర్శిటీ
* రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు.
* స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతాం.
* అంతర్జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను తీర్చిదిద్దేలా శిక్షణ ఇప్పిస్తాం.
* క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్.. అన్ని రకాల క్రీడలకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీలు, స్టేడియంలు.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
* టెంపుల్, ఏకో, టైగర్ ఏకో టూరిజం ఏర్పాటు.
* గిరిజనులు, చెంచులకు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!