నియామకాల పేరిట దోపిడీ: ప్రవీణ్‌కుమార్‌

నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ లిక్కర్‌, లీకేజీ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌లలో అక్రమాలకు పాల్పడి దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 09 Jun 2023 04:19 IST

బాన్సువాడ, న్యూస్‌టుడే: నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ లిక్కర్‌, లీకేజీ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌లలో అక్రమాలకు పాల్పడి దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ర్యాలీ నిర్వహించి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. భారాస ప్రభుత్వం ప్రజలను బలవంతంగా తరలిస్తూ సంబురాలు నిర్వహిస్తోందని, వీటిని బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారాస, భాజపా రెండు మోసపూరిత పార్టీలేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరైనా మా ఎజెండాను నమ్మి ముందుకు వస్తే కలిసి పోరాడుతామని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు