మాట తప్పడమే జగన్ విశ్వసనీయత
ఏ హామీ అమలు చేయకుండానే 99.5% హామీలను అమలు చేసినట్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి చెప్పడం దారుణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజం
ఈనాడు, దిల్లీ: ఏ హామీ అమలు చేయకుండానే 99.5% హామీలను అమలు చేసినట్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి చెప్పడం దారుణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. మాట తప్పడమే ఆయన విశ్వసనీయత అని ఎద్దేవా చేశారు. దిల్లీలోని తన నివాసంలో గురువారం ఎంపీ విలేకర్లతో మాట్లాడారు. ‘సీపీఎస్ రద్దుతో పాటు, ఐఆర్ వెంటనే అమలు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ చెప్పిన మాటలు విని ఉద్యోగులు, నిరుద్యోగులు ఓట్లు వేశారు. మద్యనిషేధం అమలు చేస్తామన్న హామీని మహిళలు నమ్మారు. అమ్మఒడి పథకంలో భాగంగా ప్రతి బిడ్డకూ డబ్బులు ఇస్తామని చెప్పడంతో ముగ్గురు పిల్లలు ఉన్నవారు రూ.45 వేలు వస్తాయని కలలుగన్నారు. జగన్ ఈ హామీలన్నీ తుంగలో తొక్కారు. గ్యారంటీ లేని ఒక పెన్షన్ స్కీమును తీసుకొచ్చి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పడం హాస్యాస్పదం. సీపీఎస్ కోసం ఉద్యోగుల జీతాల్లో 10% కట్ చేస్తున్న ప్రభుత్వం, తన వంతుగా జమ చేయాల్సిన 10% మొత్తాన్ని మూడు నెలలుగా జమ చేయడం లేదు’ అని రఘురామ ధ్వజమెత్తారు. జీతాలే సరిగా ఇవ్వని ఈ ప్రభుత్వం.. కొత్త పింఛను విధానం తీసుకొచ్చి రిటైరయ్యాక పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!