పథకాల లబ్ధి కంటే.. విద్యుత్తు ఛార్జీల దోపిడే ఎక్కువ
సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ చేకూరుస్తున్న మేలు కంటే నాలుగేళ్లలో విద్యుత్తు ఛార్జీల బాదుడుతో ప్రజల నుంచి దోచుకున్నదే ఎక్కువని తెదేపా ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు.
ఇండోసోల్ నుంచి ఒక్క యూనిట్ కొంటూ.. రెండు యూనిట్లకు చెల్లింపులు
ప్రజలపై రూ.57 వేల కోట్ల భారం
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్
ఈనాడు డిజిటల్, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ చేకూరుస్తున్న మేలు కంటే నాలుగేళ్లలో విద్యుత్తు ఛార్జీల బాదుడుతో ప్రజల నుంచి దోచుకున్నదే ఎక్కువని తెదేపా ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. నేరుగా యూనిట్ ధరలు పెంచకుండా.. ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్ఛార్జీలంటూ రకరకాల పేర్లతో సామాన్యుల్ని దోచుకుంటున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబం విద్యుత్తు ఛార్జీల రూపేణా 2014-19 వరకు తెదేపా హయాంలో, తర్వాత వైకాపా పాలనలో సగటున ఎంత మేర చెల్లించారో లెక్కలు బయటపెట్టాలని సవాలు విసిరారు. ప్రభుత్వ అసమర్థత, కమీషన్ల కక్కుర్తి, నాసిరకం బొగ్గు కొనుగోళ్లతో ఏడుసార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.57 వేల కోట్ల అదనపు భారం వేశారని మండిపడ్డారు. గురువారం పయ్యావుల జూమ్ యాప్లో విలేకరులతో మాట్లాడారు. ‘తక్కువ ధరకు లభించే విద్యుత్ను కాదని, ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేవారి నుంచి అధిక ధరకు కొంటోంది. దీంతో డిస్కంలు భారాన్ని మోయాల్సి వస్తోంది. నాసిరకం బొగ్గు కొని విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల థర్మల్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కరెంటు కోతలు పెరిగాయి. హిందూజా నుంచి ఒక్క యూనిట్ విద్యుత్తు కొనకపోయినా ఒప్పందం ప్రకారం ఆ సంస్థకు రూ.2,200 కోట్లు చెల్లిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అవకాశమున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకే సిద్ధపడింది. ఇండోసోల్ నుంచి ఒక్క యూనిట్ విద్యుత్తు కొంటూ.. రెండు యూనిట్లకు చెల్లిస్తున్నారు’ అని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తెదేపా ప్రభుత్వం ఏపీని మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చింది. కొత్తగా పైసా ఛార్జీలు పెంచలేదు. 9 వేల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని 19 వేల మెగావాట్లకు పెంచాం. ఈ నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వం అదనంగా ఒక్క మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేసింది లేదు. ఎన్డీపీసీ నుంచి ఏపీకి రావాల్సిన 244 మెగావాట్లు, ఎన్డీఈసీఎల్ (వల్లూరు) నుంచి 86, ఎన్డీపీఎల్(తమిళనాడు) నుంచి 121, ఎన్ఎన్టీఎస్ నుంచి 52 ఇలా సుమారు 500 మెగావాట్లు ఏపీకి వాటాగా రావాల్సి ఉంది. దీన్ని వాడుకునే ప్రయత్నం చేయలేదు. స్మార్ట్ మీటర్ల పేరుతో రానున్న ఏడేళ్లలో మరో అదనపు దోపిడీకి తెరలేపారు’ అని కేశవ్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట