Nara Lokesh: దోపిడీలో జగన్తో వైకాపా నేతలు పోటీ
ముఖ్యమంత్రి జగన్తో వైకాపా నేతలు పోటీపడి దోపిడీకి పాల్పడుతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
ఎమ్మెల్యే మేడా, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటిపై ఆరోపణలు
సిద్దవటం బహిరంగ సభలో లోకేశ్
ఈనాడు, కడప: ముఖ్యమంత్రి జగన్తో వైకాపా నేతలు పోటీపడి దోపిడీకి పాల్పడుతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటుండగా.. రాజంపేటను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి కొల్లగొడుతున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్ర శుక్రవారం రాజంపేట నియోజకవర్గ పరిధిలో సాగింది. సిద్దవటంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలు, ప్రజలకు అన్యాయం తెలుసుకున్నాక రాష్ట్రంలో ఇంత చేతగాని ఎమ్మెల్యే ఎవరూ లేరని తేలిపోయింది. బినామీల పేరుతో వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కొట్టేశారు’ అని ఆరోపించారు. ‘జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ్రెడ్డి సైతం భూకుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేస్తున్నారు’ అని విమర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు కేవలం ఆర్డీవోపై చర్యలు తీసుకుని సరిపుచ్చారన్నారు. భూములు కొట్టేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని లోకేశ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ కలిసి రూ.కోట్ల జడ్పీ నిధులను కాజేశారని ఆరోపించారు. జగన్ను ఆదర్శంగా తీసుకుని ఇద్దరూ ఊరుకో ప్యాలెస్ కట్టుకున్నారని వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, రాజంపేటతోపాటు స్వగ్రామాల్లోనూ ప్యాలెస్లు ఉన్నాయన్నారు. వారిద్దరూ కలిసి స్వార్థ ప్రయోజనాల కోసం రాజంపేటను సర్వనాశనం చేశారని విమర్శించారు. రాజంపేట జిల్లాకేంద్రం కాకుండా, వైద్య కళాశాల రాకుండా చేయడంపై వారు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఇసుక దోచుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో అమ్ముకుంటున్నారని విమర్శించారు.
* సర్కారు తీరుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలను పసిగట్టిన ప్రభుత్వం ఆదోనిలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ గత నెల 31న ఆగమేఘాలపై జీవోనిచ్చిందని లోకేశ్ తెలిపారు. యువగళం ప్రజల్లో చైతన్యాన్ని రగల్చడమేగాక దున్నుపోతు సర్కారులోనూ చలనం తెస్తోందనడానికి ఈ జీవోనే ఉదాహరణ అని అన్నారు. ‘తెదేపా అధికారంలోకి రాగానే నీకు కోడిగుడ్ల సన్మానం ఖాయం. క్లెమోర్మైన్లకే భయపడని కుటుంబం మాది. కోడిగుడ్డు బ్యాచ్కు భయపడతామా? నా మీద కోడిగుడ్లు వేయించి ఎక్కడికి పారిపోతావు’ అంటూ నిప్పులు చెరిగారు.
‘మార్గదర్శి’... మీవిలా సూట్కేసు కంపెనీ కాదు
‘జగన్ తెలుసుకోవాల్సింది ఏమంటే ‘మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ మీ కంపెనీల్లాగా సూట్కేసు కంపెనీ కాదు. అసలు మార్గదర్శిపై ఎక్కడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కక్ష సాధింపుతో విచారణ అంటూ హడావుడి చేస్తున్నారు. విచారణ పూర్తయ్యాక మంగళవారం రాత్రి సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ విచారణకు సహకరించారని అన్నారు. మంచిగా మాటలు చెప్పిన అధికారి.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన సంకేతాలతో స్వరం మార్చారు. 14 గంటల్లోనే మాట మార్చి విచారణకు సహకరించలేదంటూ మళ్లీ ప్రెస్మీట్ పెట్టి చెప్పారు. కక్ష సాధింపునకు ఇదొక ఉదాహరణ’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్