పిల్ల కాలువా తవ్వించలేని వ్యక్తి.. నీటిపారుదల మంత్రా?
జగన్ ప్రభుత్వానికి ‘ఎక్స్పైరీ డేట్’ దగ్గర పడిందని, ప్రజలు ఆయనకిచ్చిన సమయం అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని, తొమ్మిది నెలల తర్వాత అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గనుల దోపిడీదారు.. మైనింగ్ మంత్రి
పట్టుమని పదిళ్లూ కట్టలేని.. గృహనిర్మాణ శాఖామాత్యుడు
కోడిగుడ్డు కథ చెప్పే.. పరిశ్రమల మంత్రి
జగన్ను కేసుల నుంచి తప్పించేందుకు యాగాలు చేయించే దేవాదాయ మంత్రి
రైతుబజార్నూ తాకట్టు పెట్టిన అప్పుల శాఖామాత్యుడు
చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వానికి ‘ఎక్స్పైరీ డేట్’ దగ్గర పడిందని, ప్రజలు ఆయనకిచ్చిన సమయం అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని, తొమ్మిది నెలల తర్వాత అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సామాజిక మాధ్యమ విభాగం ఐటీడీపీ సభ్యుల అభినందన సభలో ఆయన ప్రసంగించారు. ‘మంత్రులు చాలా దారుణంగా తయారయ్యారు. ఎక్కడ గనులున్నా కొట్టేసే వ్యక్తి మైనింగ్ మంత్రి. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రి. సొంత నియోజకవర్గంలో పిల్ల కాలువ కూడా తవ్వించలేని గొప్ప నాయకుడేమో నీటిపారుదల శాఖ మంత్రి. నియోజకవర్గంలో తన పదవీకాలంలో పట్టుమని పది ఇళ్లు కట్టలేని నాయకుడు గృహ నిర్మాణశాఖ మంత్రి. పరిశ్రమల గురించి చెప్పమంటే కోడిగుడ్డు కథ చెప్పే నాయకుడు ఆ శాఖకు మంత్రి. కోర్టులో జగన్కు మేలు జరగాలని, వివేకా హత్య కేసు నుంచి తప్పించుకోవాలని పూజలు చేసే నాయకుడు దేవాదాయశాఖ మంత్రి. ఏం మంత్రండీ మీరు? భగవంతుడికి భక్తులిచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి.. చెప్పులు కూడా తీయకుండా హోమానికి వెళ్లే వ్యక్తి కోసం ఇవన్నీ చేస్తారా? ప్రతి మతానికి, జాతికి సంప్రదాయాలు, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదు. ఆర్థిక శాఖకు మంత్రి నిజానికి అప్పుల శాఖకే అమాత్యుడు. తెల్లారి లేస్తే ఏది తాకట్టు పెట్టాలా అని ఆలోచించడమే ఆయన పని. చివరకు రైతుబజార్ను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనత ఆయనదే. పిల్లల జీవితాల్ని నాశనం చేసిన వ్యక్తి విద్యా శాఖ మంత్రి’ అని చంద్రబాబు మంత్రులపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు.
నేను చేసిన అభివృద్ధి పోలవరాన్ని అడగండి
‘మంత్రులకు ప్రెస్మీట్ పెట్టమని ఉదయమే ఆదేశాలు వస్తాయి. ‘సాక్షి’ నుంచి నోట్ వస్తుంది. దాన్ని బట్టీపట్టి తూచా తప్పకుండా చదివేస్తారు. వారి ప్రెస్మీట్లో సగం నన్ను తిట్టడానికి, మరో సగం తెదేపా హయాంలో ఏమీ చేయలేదని చెప్పడానికే సరిపోతుంది. నేనేం చేశానో, ఏం చేయలేదో హైదరాబాద్ నగరాన్ని చూస్తే, పోలవరం ప్రాజెక్టును అడిగితే, అమరావతిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. హైదరాబాద్కు దీటుగా ఆంధ్రప్రదేశ్కు ఆధునిక నగరాన్ని నిర్మించాలని అమరావతిని పరుగులు పెట్టించాం. ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చాక.. అమరావతి నిర్మాణం ఆపేశారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.
సీఎంకు సభ్యత, సంస్కారం ఉన్నాయా?
‘హజ్ యాత్రికులు అల్లాకి అతిథులుగా వెళుతున్నారు కాబట్టి, వారిని కలసి ఆశీర్వచనం తీసుకోవడానికి నేను కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను. ముఖ్యమంత్రికి సభ్యత, సంస్కారం ఉంటే అది పూర్తయ్యాక వెళ్లాలి. కానీ నా కార్యక్రమాన్ని రద్దు చేయించి వెళ్లారు. దాన్ని వివాదం చేయడం ఇష్టం లేక... ఆయన తిరిగి వెళ్లాకే నేను వెళ్లాను. హజ్ యాత్రికులంతా చాలా సంతోషించారు. హైదరాబాద్లో నేను హజ్హౌస్ కట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ హజ్హౌస్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, నేను అధికారంలోకి రాగానే కట్టాలని కోరారు. తప్పకుండా కడతామన్నాను. తెదేపా అధికారంలో ఉండగా హజ్ హౌస్ నిర్మాణానికి రూ.145 కోట్లు మంజూరు చేసి, శంకుస్థాపన కూడా చేశాం. వైకాపా ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి ఉంటే.. హజ్ యాత్రికులను నంబూరులోని ఒక మదర్సాలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవండి!
ఐటీడీపీ చాలా వేగంగా, సమర్థంగా పని చేస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. ‘సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా బాగా చేశారు. 21 లక్షల సభ్యత్వాలు పూర్తి చేశారు. మహానాడులో మొదటి విడత మేనిఫెస్టోను విడుదల చేస్తే.. నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ దాన్ని చేరవేయడంతో, అందరూ తెదేపాకు జేజేలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఐడీడీపీలోని 32 వేల మంది వారి సెల్ఫోన్లకు పనిపెట్టి.. వైకాపా ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలపై సృజనాత్మకంగా కంటెంట్ సృష్టించి, ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి. వైకాపాలో చాలా మంది జోకర్లే. సమాజాన్ని అతలాకుతలం చేసి, పైశాచికానందం పొందే వ్యక్తులే. వాళ్ల గురించి ప్రచారం చేయడానికి మీకు కావాల్సినంత విషయం ఉంది. మీరు ఎంతగా సృజనాత్మకత పెంచుకుంటే ప్రజల్ని అంతగా ప్రభావితం చేస్తారు. యుద్ధానికి ఇక తొమ్మిది నెలలే ఉంది. అన్ని అస్త్రాలూ సిద్ధం చేయండి’ అని సూచించారు. పార్టీ కార్యక్రమాల్ని సామాజిక మాధ్యమాల్లో వేగంగా ప్రజలకు చేరవేస్తున్న, ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టులు పెడుతున్న, ఐదు వేలకు మించి సభ్యత్వాలు నమోదు చేయించిన 600 మంది ఐటీడీపీ సభ్యుల్ని చంద్రబాబు చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, రవి వేమూరి, చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిద్దాం
ఐకాస నాయకులకు చంద్రబాబు భరోసా
తుళ్లూరు, న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెదేపా విజయం సాధిస్తుందని, అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిద్దామని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చినట్లు ఐకాస నాయకులు తెలిపారు. మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో అమరావతి రైతు ఐకాస నాయకులు చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజధాని అమరావతిలో ప్రస్తుత పరిణామాలు, ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి సెంటు భూములు పంపిణీ చేయడం, మట్టి దందాలు, ఉద్యమకారులపై పోలీసుల అక్రమ కేసులు, తదితర విషయాలను చంద్రబాబుకు వివరించారు. కార్యక్రమంలో అమరావతి దళిత ఐకాస నాయకుడు పులి చిన్నా, పువ్వాడ సుధాకర్, ధనేకుల రామారావు, ఆకుల జయసత్య, గౌర్నేని స్వరాజ్యరావు, బెల్లంకొండ నరసింహారావు, ఆలూరి శ్రీనివాసరావు, మాదల వాసు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.