Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి రాజ్యసభలో చుక్కెదురు
రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో ‘ఇండియాస్ గ్లోరియస్ స్పేస్ జర్నీ మార్క్డ్ బై సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్-3’ అన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ చంద్రబాబు గురించి మాట్లాడారు.
చంద్రబాబుపై ఆరోపణలు.. వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యులు
వాటిని అరాచకపార్టీలుగా అభివర్ణించిన వైకాపా నేత
ఈనాడు, దిల్లీ: రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో ‘ఇండియాస్ గ్లోరియస్ స్పేస్ జర్నీ మార్క్డ్ బై సక్సెస్ఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్-3’ అన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ చంద్రబాబు గురించి మాట్లాడారు. ‘‘దేశంలో తాము ఎన్నో చేసినట్లు కాంగ్రెస్, భాజపా చెప్పుకొంటుండగా మధ్యలో మా రాష్ట్ర ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు వచ్చి సైన్స్కి తానెంతో చేసినట్లు ప్రకటించుకుంటున్నారు. ఎన్నోసార్లు ఆయన తానే కంప్యూటర్ను తయారుచేసినట్లు, అంతరిక్ష పరిశోధనకు తానే ఆద్యుడినని, సెల్ఫోన్ను తానే కనిపెట్టినట్లు ప్రకటించుకున్నారు’’ అని పేర్కొన్నారు.
దాంతో ఆ సమయంలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, భారాస సభాపక్ష నాయకుడు కె.కేశవరావు అడ్డుపడగా మీ మాట నేను వినదలచుకోలేదు, దయచేసి కూర్చోమని విజయసాయిరెడ్డి గద్దించారు. డీఎంకే సభాపక్ష నేత తిరుచ్చి శివ లేచి అభ్యంతరం వ్యక్తం చేయగా తన ప్రసంగానికి అడ్డుపడే హక్కు మీకు లేదంటూ ఆయనపైనా ఆగ్రహం వ్యక్తంచేసి, ప్రసంగాన్ని కొనసాగించారు. చంద్రబాబు నిజంగా అన్నీ కనిపెట్టారా అన్న విషయాన్ని మీరు విచారించి కనిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఐటీ, కంప్యూటర్, సెల్ఫోన్ను ఆయన కనిపెట్టింది నిజమైతే భారత్ దానిపై పేటెంట్ హక్కులు కోరొచ్చన్నారు. ఆ పేటెంట్ హక్కుల కింద బిలియన్ల రూపాయలు పొందొచ్చని వ్యంగ్యంగా అన్నారు.
ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు విజయసాయి ప్రసంగానికి అడ్డుతగులుతూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తగా మొత్తం ప్రతిపక్షం అరాచకంగా వ్యవహరిస్తోందని వారిపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ అరాచక పార్టీ అని, మిగిలిన ప్రతిపక్షాలు వారితో చేరి దేశాన్ని అరాచకంగా మార్చాయని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే సహా మిగిలిన ప్రతిపక్షపార్టీల సభ్యులంతా లేచి అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో విజయసాయిరెడ్డి చంద్రబాబు గురించి చెప్పకుండా తనను అడ్డుకోలేరన్నారు. ఈ పార్టీలన్నీ అరాచకపార్టీలని, దేశంలో అలజడి సృష్టించడానికే అవి ప్రాధాన్యం ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏవైనా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న మమతా మొహంత హామీ ఇచ్చారు. చివరగా విజయసాయిరెడ్డి ప్రసంగం ముగించిన తర్వాత వామపక్ష సభ్యుడొకరు ‘‘బెయిల్ మీద ఉన్న నాయకుడు... జైల్లో ఉన్న నాయకుడిని ప్రశ్నిస్తున్నారు’’ (లీడర్ ఆన్ బెయిల్... క్వశ్చనింగ్ ది లీడర్ ఇన్ జైల్) అంటూ విజయసాయిరెడ్డిపై వ్యంగ్యాస్త్రం సంధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Elections: కల్వకుర్తిలో కాంగ్రెస్, భారాస శ్రేణుల ఘర్షణ
అసెంబ్లీ ఎన్నికల (Telangana Election 2023) నేపథ్యంలో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
Nara Lokesh: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్
రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. -
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని వైకాపా అభిమాని పేముల మనోహర్ ప్రశ్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. -
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
‘ఎన్నికలకు మహా అయితే 140 రోజుల గడువుంది.. ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది. -
అయిదేళ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. -
15 మందిలో 10 మంది వారే
ముఖ్యమంత్రి జగన్ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రం నుంచి డిప్యుటేషన్పై తీసుకొస్తే.. వారిలో పది మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. -
పర్చూరు వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకలాపాలు పెరిగాయి. -
వైకాపా గద్దె దిగకుంటే ప్రజలకు కష్టాలే
ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పీఎఫ్ చెల్లింపులు ఆగిపోయాయని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులూ అందడం లేదని విమర్శించారు. -
132 ఓట్ల తొలగింపునకు ఒకే వ్యక్తి దరఖాస్తు
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒకే వ్యక్తి 132 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఓటర్ల జాబితాలో అక్రమాలపై విచారణ చేపట్టండి
జిల్లాలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. -
మంత్రి బొత్స ఇలాకాలోని జాబితాలో మృతుల పేర్లు
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబును అడ్డుకుంటున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతోనే ఆయన్ను బయట తిరగకుండా అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో శతవిధాలా ప్రయత్నించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అప్పుల్లో దేశంలోనే నంబర్-1 గా ఏపీ
రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు వినియోగించకుండా తన రెవెన్యూ ఖర్చులకు ఉపయోగిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. -
మట్కా, బెట్టింగ్ ఆడేవారిని ఉరేస్తారా?
మట్కా, క్రికెట్ బెట్టింగ్కు పాల్పడేవారిపై.. వాటి నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అన్నారు. -
అయిదు రాష్ట్రాల్లో.. 18% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల వాటా 29%. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. -
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూబకాసురులు ఎవరు?
లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూములు కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులపరమవుతుంటేే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి విజయ్కుమార్ ప్రశ్నించారు. -
ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇంకెవరూ లేరా?
ఒక సామాజికవర్గానికి చెందిన వారే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం వెనకున్న ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన మండలాధ్యక్షులు
నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. -
అధికారంలోకి రాగానే ఖాళీలన్నీ భర్తీ: నాగబాబు
తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పేర్కొన్నారు. -
ఓబీసీ జాబితాలో తూర్పుకాపులను చేర్చడానికి ఎన్సీబీసీ సిఫార్సు: ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand tunnel: సొరంగం ఆపరేషన్ను లైవ్లో చూసి.. మోదీ భావోద్వేగం
-
సొరంగంలోని బిడ్డకోసం 16 రోజులు నిరీక్షించి.. బయటకొచ్చే కొద్ది గంటల ముందే..!
-
Pragathi: ఆర్థిక కష్టాలు.. కన్నీళ్లు.. నటి ప్రగతి ఇంత ‘స్ట్రాంగ్’గా ఉండటానికి కారణాలివే..!
-
Stock Market: సెన్సెక్స్కు 728 పాయింట్ల లాభం.. 21,000 చేరువకు నిఫ్టీ
-
Naga Chaitanya: వైఫల్యాలు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పరు..: నాగచైతన్య
-
TS Elections: కల్వకుర్తిలో కాంగ్రెస్, భారాస శ్రేణుల ఘర్షణ