కమలంతో కుదిరిన దళ్ దోస్తీ!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికలకు ఎన్డీయేలో తాము భాగమవుతున్నట్లు జనతాదళ్ (సెక్యులర్) ప్రకటించింది.
ఎన్డీయేలో భాగమైన జేడీఎస్
స్వయంగా ప్రకటించిన దేవేగౌడ
ఈనాడు, బెంగళూరు/దిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికలకు ఎన్డీయేలో తాము భాగమవుతున్నట్లు జనతాదళ్ (సెక్యులర్) ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ శుక్రవారం దిల్లీలో ఈ విషయం స్వయంగా ప్రకటించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పొత్తు ఖరారుపై ఇదే సందర్భంగా చర్చించారు. దిల్లీలోని అమిత్ షా ఇంట్లో 45 నిమిషాలసేపు ఈ భేటీ జరిగింది. చర్చల అనంతరం జేపీ నడ్డా ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘‘పార్టీ సీనియర్ నాయకులు అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చించాం. ఎన్డీయేలో భాగస్వామి అయ్యేందుకు జేడీఎస్ తీసుకున్న నిర్ణయం హర్షదాయకం. జేడీఎస్ను హృదయపూర్వకంగా ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నాం’’ అని ప్రకటించారు. జేడీఎస్ చేరికతో ఎన్డీయే మరింత శక్తిమంతం అవుతుందని అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈరోజు ఎన్డీయేలో మేము అధికారికంగా చేరాం. కర్ణాటకలో అవినీతికి పాల్పడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ను ఓడించేందుకు చేతులు కలిపాం’’ అన్నారు.
దసరా తర్వాత సీట్ల పంపకం..
అక్టోబరులో జరగనున్న దసరా పండగ తర్వాత లోక్సభ సీట్ల పంపకం గురించి భాజపా, జేడీఎస్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని తమ పార్టీ నేతలతో చర్చించాక భాజపా ఈ విషయలో ఒక నిర్ణయానికి రానుంది. ‘‘సీట్ల పంపకం పెద్ద విషయం కాదు. ఉభయులం సానుకూలంగానే ఉన్నాం. ఆ అంశాన్ని పరిష్కరించుకుంటాం’’ అని కుమారస్వామి తెలిపారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా.. జేడీఎస్ 6 నుంచి 8 స్థానాలు అడుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, భాజపా 3 లేదా 4 స్థానాలు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లకు వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు తాము చేస్తున్న పోరాటానికి స్పష్టత ఇచ్చినట్లు అయ్యిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. -
Gutha Sukender Reddy: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ‘సాగర్’ దుశ్చర్య: గుత్తా
తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు సాగర్ డ్యామ్పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించారు. -
Rahul Gandhi: వచ్చే పదేళ్లలో 50% మహిళా సీఎంలే ఉండేలా పనిచేద్దాం: రాహుల్
కాంగ్రెస్ సంస్థాగత పదవుల్లో మహిళల పాత్రను గణనీయంగా పెంచేందుకు క్రియాశీలంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
కేసీఆర్తో జగన్ దోస్తీ ఆస్తులు కాపాడుకోవడానికేనా?
తెలంగాణలో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికే సీఎం జగన్ కేసీఆర్తో దోస్తీ చేస్తున్నారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. -
Pawan Kalyan: తెదేపాతో పొత్తుపై నోరు జారితే సహించను
‘జనసేన తెదేపా పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైకాపా కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. -
ప్రజల్లోకి ఎప్పుడు, ఎలా వస్తానో త్వరలో చెబుతా
-
కోడికత్తిలా నాగార్జునసాగర్ డ్రామా
ఎప్పుడూ లేని కరవు రాష్ట్రాన్ని వెంటాడుతోందని, రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్లో హాయిగా ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
కొప్పుల ఈశ్వర్పై ఎన్నికల పిటిషన్ కొట్టివేత
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. -
స్వప్రయోజనాలకే కృష్ణా జలాల తాకట్టు
తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి, బాబాయ్ హత్య కేసు నుంచి అవినాష్రెడ్డిని కాపాడటానికి.. కృష్ణా జలాల్ని పక్క రాష్ట్రానికి సీఎం జగన్ ధారాదత్తం చేశారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
బినామీలకు ఎసైన్డ్ భూములు కట్టబెట్టే కుట్ర
గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల ఎసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదుచేయించి, ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు భారాస నేతలు కసరత్తు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. -
‘యువగళం’.. వైకాపా పతనానికి నాంది
తెదేపా అధినేత చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవలంబించిన వైఖరే ఆ రాష్ట్రంలో భారాస పార్టీ గడ్డు పరిస్థితికి కారణమని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జి.చిన్నయ్య దొర విమర్శించారు. -
జల వివాదం కేసీఆర్, జగన్ల ఎత్తుగడ: కోదండరాం
ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఓటు హక్కు ద్వారా ప్రజలు తిరుగుబాటు చేశారని, ఆ మేరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
రాష్ట్రంలో జగన్ పీనల్ కోడ్
రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో జగన్ పీనల్ కోడ్ అమలవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
10 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు!
తెదేపా అధినేత చంద్రబాబు త్వరలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు