లోక్సభలో విద్వేష వ్యాఖ్యల దుమారం
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వేళ లోక్సభలో భాజపా సభ్యుడొకరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
బీఎస్పీ ఎంపీ దానిశ్ అలీపై భాజపా సభ్యుడు రమేశ్ బిధూడీ అనుచిత ప్రవర్తన
తీవ్రంగా ఖండించిన ప్రతిపక్షాలు
బిధూడీపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం
షోకాజ్ నోటీసు జారీ చేసిన కమలం పార్టీ
దిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వేళ లోక్సభలో భాజపా సభ్యుడొకరు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ, మైనారిటీ వర్గానికి చెందిన కున్వర్ దానిశ్ అలీపై భాజపా ఎంపీ రమేశ్ బిధూడీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీటిని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.
లోక్సభలో గురువారం రాత్రి చంద్రయాన్-3 విజయంపై చర్చ జరుగుతున్న సమయంలో.. దక్షిణ దిల్లీకి చెందిన భాజపా ఎంపీ బిధూడీ.. దానిశ్ అలీని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తమ పార్టీ ఎంపీ ప్రవర్తనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే విచారం వ్యక్తం చేశారు. బిధూడీ వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం హెచ్చరించారు. బిధూడీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బిధూడీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘భాజపా ఎంపీ వ్యాఖ్యలు పార్లమెంటుకు, ఎంపీలందరికీ అవమానకరం. బిధూడీని తక్షణం లోక్సభ నుంచి సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్.. దానిశ్ అలీని కలసి సంఘీభావం ప్రకటించారు.
చర్యలు తీసుకోకపోతే లోక్సభ సభ్యత్వాన్ని వదులుకుంటా..: దానిశ్
రమేశ్ బిధూడీ తనపై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర కలత చెందినట్లు దానిశ్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రివిలేజెస్ కమిటీకి పంపి విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అందులో బిధూడీ తనపై చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. మరోవైపు ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బిధూడీపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాను లోక్సభ సభ్యత్వాన్ని వదులుకోవడంపై యోచిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బిధూడీ చేసిన వ్యాఖ్యలను భాజపా అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ బిధూడీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మరోవైపు లోక్సభలో బిధూడీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న భాజపా ఎంపీలు హర్షవర్ధన్, రవిశంకర్ప్రసాద్ నవ్వుతూ కనిపించడం విమర్శలకు తావిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
KCR: కేసీఆర్కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు
భారాస అధినేత కేసీఆర్ను బుధవారం ఆయన స్వగ్రామం చింతమడక వాసులు పెద్ద ఎత్తున కలిశారు. -
Revanth Reddy: ప్రమాణ స్వీకారానికి ఇదే నా ఆహ్వానం.. తెలంగాణ ప్రజలకు రేవంత్ లేఖ
ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్రెడ్డి ఆహ్వానించారు. -
BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో అధికారం దక్కించుకున్న భాజపా సీఎంలను ఎంపిక చేసే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి అసెంబ్లీలో బరిలో దిగి గెలిచిన పలువురు ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. -
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
Telangana secretariat: రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా: కోదండరామ్
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. -
రేవంత్ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్ చెప్పిన బండ్ల గణేశ్
రేవంత్రెడ్డి సీఎం అవుతారని తాను నెలరోజుల క్రితమే చెప్పానని.. అదే నిజమైందని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) అన్నారు. -
TDP-Janasena: తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను పవన్ కలిశారు. -
TDP: తితిదే బడ్జెట్ను వైకాపా ఎలక్షన్ బడ్జెట్లా మార్చేశారు: తెదేపా నేత విజయ్కుమార్
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో(TTD) అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1200 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. -
తుపాను బాధితులకు భోజనమూ పెట్టలేరా?
తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరాలైన ఆహారం, నీళ్లు, పునరావాసం కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
తుపాను సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం
తుపాను తీవ్రతపై కేంద్ర సంస్థలు వారం నుంచే హెచ్చరికలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షించకపోవడం దారుణమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. -
హామీలు గుర్తుచేస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు
ప్రశ్నిస్తే స్వపక్షమైనా వైకాపా చేతిలో బాధితులుగా మిగలాల్సిందే. సీఎం జగన్ సొంత జిల్లా వైయస్ఆర్లో ఖాజీపేట మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రభాస్కర్రెడ్డిని.. వైకాపా నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
జగన్ నిర్లక్ష్య వైఖరితో రైతులకు నష్టం
ప్రస్తుత తుపాను కారణంగా రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ముంపు బాధితులను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు
మిగ్జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బాపట్ల రాజీవ్గాంధీ కాలనీలో భాగమైన ఎస్టీ కాలనీ ముంపునకు గురైంది. -
తుపాను సహాయక చర్యల్లో పాల్గొనండి
మిగ్జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని భాజపా శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపునిచ్చారు. -
ఏపీలో పంచాయతీలకు అందని ఆర్థిక సంఘం నిధులు
ఆర్థిక సంఘం 2019 నుంచి 2023 వరకు స్థానిక సంస్థల కోసం రూ.8,629 కోట్ల నిధులు విడుదల చేసినా అవేవీ స్థానిక సంస్థల ఖాతాలకు చేరలేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
తుపానుతో నష్టపోయిన రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలి
మిగ్జాం తుపానుతో నష్టపోయిన రాష్ట్రాలకు.. కేంద్రం పూర్తి సహాకారాన్ని అందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. -
ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లు ఇవ్వాలి: సీపీఐ
మిగ్జాం తుపాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు కనీసం రూ.10 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. -
తుపాను ఉపశమన చర్యలకు రూ.5 వేల కోట్లు ఇవ్వండి: గల్లా జయదేవ్
మిగ్జాం తుపానుతో రాష్ట్రంలో పంటలు, రహదారులు, భవనాలు ధ్వంసమయ్యాయని, విద్యుత్ స్తంభాలు నెలకూలి సరఫరాకు అంతరాయం కలిగినందున తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టేందుకు రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ తీర్పుతో జగన్కు కనువిప్పు కలగాలి
తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా ఏపీ సీఎం జగన్కు కనువిప్పు కలగాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ హితవు పలికారు. -
వృత్తికి ద్రోహం చేసి న్యాయస్థానాల్లో స్టేలు తెచ్చుకోవడం సిగ్గుచేటు: బొండా ఉమా
వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాలంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అక్టోబరు 23న జారీ చేసిన నోటీసులపై ఆయన ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. -
బల్క్గా ఫారం-7 దరఖాస్తుల స్వీకరణ ఆపాలి
పలు నియోజకవర్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా బల్క్గా ఫారం-7లు స్వీకరిస్తున్నారని.. ఆ పోకడను వెంటనే నిలువరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాను తెదేపా నేతలు కోరారు.


తాజా వార్తలు (Latest News)
-
5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు
-
SI Exam Results: ఏపీలో ఎస్సై పరీక్ష తుది ఫలితాలు విడుదల
-
UCO bank: వేలాది ఖాతాలు అప్పుడే ఎలా తెరుచుకున్నాయ్?
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
INDw vs ENGw: అర్ధ శతకాలతో విరుచుకుపడ్డ నాట్ సీవర్, డేనియల్.. టీమ్ఇండియా ముందు భారీ టార్గెట్
-
Tirumala: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు