జీవోలో ఉన్నవి ఒప్పందంలో ఎందుకు లేవు?
‘‘ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో తొలుత జీవోలో ఇచ్చిన అంశాలు తర్వాత ఒప్పందంలో ఎందుకు చేర్చలేదు? చంద్రబాబు విధాన నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఆయనకు బాధ్యత ఏముంటుందని తెదేపా నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నలు
ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో తొలుత జీవోలో ఇచ్చిన అంశాలు తర్వాత ఒప్పందంలో ఎందుకు చేర్చలేదు? చంద్రబాబు విధాన నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఆయనకు బాధ్యత ఏముంటుందని తెదేపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన బాధ్యత లేకుండానే ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయా?’’ అని మచిలీపట్నం ఎమ్మెల్యే (వైకాపా) పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటులో అవినీతిపై స్వల్పకాల చర్చ జరిగింది. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ జీవోలో సీమెన్స్ సంస్థ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తుందన్నారని, ఒప్పందంలో ఆ విషయం ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి పని చేయకుండానే రూ.371 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. సీఎం ఎక్కడా సంతకాలు పెట్టక్కర్లేదని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చెబుతారని, చంద్రబాబు ఇందులో 13 చోట్ల సంతకాలు చేశారని నాని అన్నారు. టెండర్లు పిలిచి అప్పజెప్పాల్సిన ఈ ప్రాజెక్టును నామినేషన్పై ఎందుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఆధారాలతో కేసు పెడితే కక్షసాధింపా?
‘‘తప్పిదాలు జరిగి కేసులు నమోదు చేస్తే అది రాజకీయ కక్షసాధింపు ఎందుకు అవుతుంది? ఇందులో అనేకమంది విచారణలో భాగంగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏం జరిగిందో చెప్పారు. సీఐడీ అనేక ఆధారాలతో చంద్రబాబుపై కేసు నమోదు చేస్తే ఆ పార్టీవారు కక్షసాధింపు అంటే ఎలా’’ అని కాకినాడ గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కె.కన్నబాబు ప్రశ్నించారు. ఇందులో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సి ఉందని, పాత్రధారులను అరెస్టుచేసి సూత్రధారులను అరెస్టు చేయవద్దా అని ప్రశ్నించారు. రూ.371 కోట్ల కార్యక్రమంలో అవినీతి అంటే చిన్న విషయం కాదని, అది చాలా పెద్ద మొత్తమని అన్నారు. అమరావతి భూముల కేసుతో పాటు ఇతర కుంభకోణాల్లోనూ దర్యాప్తు చేయాలని కన్నబాబు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
గుండెపోటుతో జనగామ జడ్పీ ఛైర్మన్ మృతి
జనగామ జిల్లా పరిషత్తు ఛైర్మన్, భారాస జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం స్టేషన్ఘన్పూర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్టేషన్ ఘన్పూర్లో గెలుపొందిన కడియం శ్రీహరితో కలిసి పాల్గొన్నారు. -
తుపాను నష్ట నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలం
మిగ్జాం తుపాను కారణంగా రైతులు పంట నష్టపోయే ప్రమాదం ఉన్నా.. నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. -
మూడు పార్టీల కలయికతో శత్రు సంహారం
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు కూటమిగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో శత్రుసంహారం చేస్తాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
రాజధాని అమరావతేనని కేంద్రం చెప్పినా వినరా: సీపీఐ, సీపీఎం
అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తించిన నేపథ్యంలో సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు మానుకోవాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
కేంద్ర బిల్లులకు మద్దతివ్వడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులన్నింటికీ మద్దతునివ్వాలని తమ పార్టీ ఎంపీలను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. -
చట్టాల్ని ఉల్లంఘిస్తున్న పోలీసులపై చర్యలెప్పుడు?
-
తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైకాపాలో వణుకు
తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. ప్రజాక్షేత్రంలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి లాంటి వాళ్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.