ఉండవల్లీ.. ఇసుక, లిక్కర్ కుంభకోణాలు కనిపించవా?
మీరు అనేక ప్రెస్మీట్లలో మద్యం సీసాలు చూపించి, ఇది విషమని.. ఇందులో ఎంతో అవినీతి జరిగిందని చెప్పారు కదా.. దీనిపై విచారణకు పిటిషన్ వేయడానికి మీ పెన్ను ముందుకు కదల్లేదా?
స్కిల్ స్కీంపై ఎవరో రాసిన పిటిషన్పై మీరు సంతకం చేశారా?
మాజీ ఎంపీ అరుణ్కుమార్ను ప్రశ్నించిన తెదేపా నేత పట్టాభి
మీరు అనేక ప్రెస్మీట్లలో మద్యం సీసాలు చూపించి, ఇది విషమని.. ఇందులో ఎంతో అవినీతి జరిగిందని చెప్పారు కదా.. దీనిపై విచారణకు పిటిషన్ వేయడానికి మీ పెన్ను ముందుకు కదల్లేదా? ఇసుకలో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరుగుతుంటే.. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక్క రేవుకైనా వెళ్లి పరిశీలించేందుకు మీ కాళ్లు కదల్లేదా..? ఇసుక అక్రమాలపై సీబీఐ విచారణ కోరేందుకు మీ పెన్ను ముందుకెళ్లలేదా?’
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, ఏవీఏ రోడ్: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నా, ఏ రోజూ న్యాయస్థానానికి కాగితం ముక్క రాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్షల మంది శిక్షణ పొంది, ఉద్యోగాలు చేస్తుంటే ఆ పథకంపై సీబీఐ విచారణకు పిటిషన్ వేశారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పేర్కొన్నారు. రాజమహేంద్రవరానికి శుక్రవారం వచ్చిన ఆయన కేంద్ర కారాగారం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, శాండ్, ల్యాండ్, మైన్, వైన్ అన్ని స్కాంలకు సాక్ష్యాధారాలున్నాయని.. ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్ ఒక డమ్మీ సంస్థ అని మీకు తెలియదా? అని నిలదీశారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్లో 44 మంది పేర్లు ప్రస్తావించిన ఉండవల్లి.. ప్రాజెక్టు అమలులో నిధుల విడుదల, ఖర్చు, నిర్ణయాలు తీసుకున్న అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక ఇచ్చిన ఆడిట్ సంస్థ పేర్లను ఏ ఉద్దేశంతో చేర్చలేదని ప్రశ్నించారు. ఈ పథకం అమలులో ప్రతి రూపాయి చెల్లింపులు చేసిన ప్రేమచంద్రారెడ్డి, ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో ఉన్న షంషేర్సింగ్ రావత్, కార్పొరేషన్ ఏర్పాటుకు జీవోలు ఇచ్చిన నీలం సాహ్ని, అజయ్జైన్, నిధులు ఇచ్చిన అజేయ కల్లం పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. వీరందర్నీ కాకుండా ఏం తప్పు చేశారని చంద్రబాబు నాయుడి పేరు ఆ జాబితాలో ప్రస్తావించారని నిలదీశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవాలనే సదుద్దేశం ఉంటే పూర్తి వివరాలు తాను పంపిస్తానని, అనాలోచితంగా ఇటువంటి పనులు చేయడం వల్ల కొన్ని లక్షల మంది యువతను రోడ్డున పడేస్తారనే అంశాన్ని గుర్తించాలని ఉండవల్లికి పట్టాభి హితవు పలికారు. మీకు ప్రజాధనంపై అంత ప్రేమ ఉంటే నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపై సీబీఐ విచారణ కోరాలని సూచించారు.
జగన్కు నామోషీగా లేదా?
జగన్కు ధైర్యంగా వచ్చి కోర్టు బోనులో నిల్చోమనండి.. ఇన్ని సంవత్సరాలు బెయిల్పై గడపటానికి నామోషీగా లేదా? అంటూ పట్టాభి ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో లోకేశ్ బస ప్రాంతం వద్ద మాట్లాడారు. లోకేశ్ పారిపోయారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. నాలుగున్నరేళ్లుగా కోర్టుకు రాలేక, పారిపోతున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. సీబీఐ కేసుల్లో జగన్ను అనేక దఫాలు విచారించి.. సరైన సమాధానాలు చెప్పకపోతే అరెస్టు చేశారే తప్ప, ఎఫ్ఐఆర్ వేసిన వెంటనే చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. మీ తమ్ముడు అవినాశ్రెడ్డిని నేరుగా లాక్కెళ్లారా.. ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారా..? అని సీఎం జగన్ను ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టులో కనీస నిబంధనలు పాటించకుండా కక్షసాధింపు చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ద్వారా క్వాష్ పిటిషన్కు సానుకూల స్పందన వస్తుందని నమ్ముతున్నామన్నారు. యడియూరప్ప కేసులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ద్వారా ఆయనకు ఉపశమనం కలిగిన విషయాన్ని గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kamal Nath: అరుదైన సన్నివేశం.. సీఎం చౌహాన్ను కలిసిన కమల్నాథ్
సీఎం శివరాజ్సింగ్ చౌహాన్తో మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్, మాజీ సీఎం కమల్నాథ్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. -
KCR: ప్రజాతీర్పును గౌరవిద్దాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కేసీఆర్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత కేసీఆర్ (KCR)ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిశారు. -
Election Commision: తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ ఎన్నికల కోడ్ను ఈసీ ఎత్తివేసింది. -
SampathReddy: గుండెపోటుతో భారాస జనగామ అధ్యక్షుడి కన్నుమూత
జనగామ జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. -
Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో సీఎల్పీ నాయకుడు ఎవరు? అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. -
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసు కేసు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (MLA Kaushik Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
TS News: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు.. ఇక ముఖ్యమంత్రే తరువాయి!
తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ను అందజేశారు. -
Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్రెడ్డి
కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్లో భారాస (BRS) ముఖ్యనేతలు ఇవాళ సమావేశమయ్యారు. -
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
ఇండియా కూటమి పార్టీలతో కలిసి రాకపోవడం వల్లే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. -
Mayawati: ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం: మాయావతి
లోక్సభ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేసేందుకు బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇక తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాలపై ఆపార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. -
PM Modi: కుటుంబం బాధలో ఉన్నా.. పార్టీని గెలిపించారు: నడ్డాపై ప్రధాని ప్రశంసలు
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అవిశ్రాంతంగా పనిచేసి పార్టీని మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
Yuvagalam: తుపాను ఎఫెక్ట్.. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయత్రికు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. -
Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పక్కాగా గెలుస్తామనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కోల్పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీకి ఊరటగా మిగిలింది. ఇక ఈ ఫలితాలను పార్లమెంట్ ఎన్నికలకు అన్వయించుకొని చూస్తే.. కాంగ్రెస్కు కొంత ఊరట లభించినా.. దిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. -
భాజపా ఎంపీలకు మిశ్రమ ఫలితాలు
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది. -
దివ్యాంగుల పింఛన్ల మంజూరులో పక్షపాతం: పవన్కల్యాణ్
తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. -
20 ఏళ్ల క్రితం ఇలాగే..: జైరాం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు. -
భాజపాను ప్రజలు ఆశీర్వదించారు: పురందేశ్వరి
కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
‘గ్యారంటీ’లు అమలు చేయడంతోనే కాంగ్రెస్ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. -
భాజపా విజయం భవిష్యత్తుకు దిక్సూచి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్కల్యాణ్ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/12/2023)
-
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది: కేంద్రం
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Kamal Nath: అరుదైన సన్నివేశం.. సీఎం చౌహాన్ను కలిసిన కమల్నాథ్
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’