జగన్ అవినీతిపై చర్చకు సిద్ధమా?
‘అయిదు రోజులపాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సీఎం జగన్ అవినీతి, కేసులు, వాటి విచారణ తీరు... తెదేపా అధినేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమా?’ అని ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.
ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సవాలు
మా మీద చేస్తున్న ఆరోపణల మీదా చర్చకు సిద్ధమే
ఉభయసభలనూ బహిష్కరించాలని నిర్ణయం
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘అయిదు రోజులపాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సీఎం జగన్ అవినీతి, కేసులు, వాటి విచారణ తీరు... తెదేపా అధినేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమా?’ అని ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాలు విసిరారు. అవసరమైతే తెదేపా అధినేత చంద్రబాబును ఒప్పించి సభకు తీసుకొస్తామని చెప్పారు. వీటికి స్థానిక, జాతీయ మీడియాను అనుమతించాలని, అప్పుడు ఎవరి బాగోతం ఏంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. సభలో మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా సమావేశాలు ముగిసేవరకూ ఉభయసభలకు వెళ్లకూడదని తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్టు వెల్లడించారు. అసెంబ్లీ నుంచి సస్పెండైన తర్వాత అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడారు. ‘‘నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి వైకాపా ఎమ్మెల్యేలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమకేసులు ఎత్తేయాలని, జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరుతూ మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. అందులో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చదవాల్సిన ఆయన.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మేం వాస్తవాలు చెప్పడానికి ప్రయతిస్తే మా మైకులు ఆపేస్తారు. సీఎం, మంత్రులు మాత్రం గంటలు గంటలు మాట్లాడుతూ.. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడూ అర్థవంతమైన చర్చ జరిపింది లేదు’’ అని విమర్శించారు.
అధికార పార్టీ వీరంగాన్ని ప్రజలకు చూపించాలనే వీడియోలు తీశాం
‘‘సాక్షి సిబ్బందిని సభలోకి అనుమతించి, మేం మాట్లాడేది మాత్రమే చూపిస్తూ... వైకాపా సభ్యుల వీరంగాన్ని కప్పిపుచ్చుతున్నారు. సభలో జరిగేవి బయటకు తెలియకుండా స్పీకర్ కట్టడి చేస్తున్నారు. ఒక్క సాక్షి ఛానల్నే సభలోకి ఎలా అనుమతిస్తారు? మీడియా అంటే అదొక్కటేనా? 200 మంది మార్షల్స్ను మా సభ్యుల చుట్టూ గోడకట్టినట్టు పెట్టారు. ధైర్యముంటే సభలో జరిగే ప్రతి పరిణామాన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయండి. మేం మాట్లాడేటప్పుడు ప్రకటనలు వేస్తూ... వైకాపా వాళ్లు మమ్మల్ని తిట్టేది మాత్రం ప్రసారం చేస్తున్నారు. అందుకే అక్కడ జరుగుతున్న వ్యవహారం సభ్యసమాజానికి తెలియజేయాలనే వీడియోలు తీశాం’’ అని అచ్చెన్న స్పష్టం చేశారు.
‘యూజ్లెస్ ఫెలోస్’ అన్నప్పుడే స్పీకర్పై గౌరవం పోయింది
‘‘అసెంబ్లీని వైకాపా కార్యాలయం కంటే దారుణంగా మార్చిన ఘనత స్పీకర్దే. మమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని.. వైకాపా వాళ్లను మాత్రం ‘మన సభ్యులు’ అన్నారు. అప్పుడే స్పీకర్పై గౌరవం పోయింది. అలాంటి వ్యక్తి చెప్పేది మేమెందుకు వినాలి’’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్రెడ్డి
కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్లో భారాస (BRS) ముఖ్యనేతలు ఇవాళ సమావేశమయ్యారు. -
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
ఇండియా కూటమి పార్టీలతో కలిసి రాకపోవడం వల్లే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. -
Mayawati: ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం: మాయావతి
లోక్సభ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేసేందుకు బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇక తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాలపై ఆపార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. -
PM Modi: కుటుంబం బాధలో ఉన్నా.. పార్టీని గెలిపించారు: నడ్డాపై ప్రధాని ప్రశంసలు
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అవిశ్రాంతంగా పనిచేసి పార్టీని మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
Yuvagalam: తుపాను ఎఫెక్ట్.. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయత్రికు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. -
Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పక్కాగా గెలుస్తామనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కోల్పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీకి ఊరటగా మిగిలింది. ఇక ఈ ఫలితాలను పార్లమెంట్ ఎన్నికలకు అన్వయించుకొని చూస్తే.. కాంగ్రెస్కు కొంత ఊరట లభించినా.. దిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. -
భాజపా ఎంపీలకు మిశ్రమ ఫలితాలు
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది. -
దివ్యాంగుల పింఛన్ల మంజూరులో పక్షపాతం: పవన్కల్యాణ్
తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. -
20 ఏళ్ల క్రితం ఇలాగే..: జైరాం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు. -
భాజపాను ప్రజలు ఆశీర్వదించారు: పురందేశ్వరి
కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
‘గ్యారంటీ’లు అమలు చేయడంతోనే కాంగ్రెస్ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. -
భాజపా విజయం భవిష్యత్తుకు దిక్సూచి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్కల్యాణ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో విజయంపై ఏపీ కాంగ్రెస్ సంబరాలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఏపీలో జగన్నూ ఓడించాలి: తులసిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆదివారం వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. -
ఆంధ్రాపై తెలంగాణ ఫలితాల ప్రభావం
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. ఆంధ్రాపై తప్పక ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. -
రాష్ట్రానికి జగన్ వద్దనడానికి సవాలక్ష కారణాలున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ
‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు. -
వ్యక్తిగత భద్రతపై పోలీసులు స్పష్టత ఇవ్వాలి
తన వ్యక్తిగత భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టతనివ్వాలని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ బీటెక్ రవి పోలీసులను ప్రశ్నించారు. -
Nara Lokesh: దళితుల్ని ఇబ్బందిపెట్టే వైకాపాను గద్దె దించుదాం
‘‘జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితసంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వట్లేదు. -
తెదేపా నేత డూండీ రాకేష్ అరెస్టు.. విడుదల
తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ను విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.


తాజా వార్తలు (Latest News)
-
Arshdeep Singh: ‘చివరి ఓవర్లో సూర్య భాయ్ ఒకే మాట చెప్పాడు’.. అర్ష్దీప్ వెల్లడి
-
Stock Market: రంకేసిన బుల్.. మదుపర్లకు లాభాల పంట
-
prabhakar Rao: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్రావు రాజీనామా
-
Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్రెడ్డి
-
Mizoram: మూడున్నర దశాబ్దాల తర్వాత కొత్త ముఖం.. ఐపీఎస్ నుంచి సీఎం వరకు ‘లాల్దుహోమా’..!
-
Rinku Singh: రింకూ ఆ పాత్రకు సరిపోతాడా!