జగన్ బెయిల్పై పదేళ్ల వేడుక
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. జగన్కు బెయిలొచ్చి పదేళ్లయిన సందర్భంగా తెదేపా అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో శనివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
మహాసేన రాజేష్ వినూత్న నిరసన
ప్రత్తిపాడు, న్యూస్టుడే: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. జగన్కు బెయిలొచ్చి పదేళ్లయిన సందర్భంగా తెదేపా అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో శనివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. జగన్ బెయిల్కు పదేళ్ల వేడుక పేరున ఈ నిరసన చేపట్టారు. సీఎం జగన్పై ఉన్న కేసుల వివరాలతో 38 కేకులను అమర్చి వాటిని పార్టీ శ్రేణుల సమక్షంలో కోశారు. సీఎంపై ఉన్న కేసుల వివరాలను ప్రదర్శిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అక్రమాలకు పాల్పడిన జగన్ 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారన్నారు. దోచిన సొమ్ముతో ఎలా రాజకీయాల్లోకి రావాలి? అందులో కొంత జనానికి ఖర్చుపెట్టి ఎలా ముఖ్యమంత్రి అవ్వాలి? మళ్లీ రూ. ఐదారులక్షల కోట్లు ఎలా గడించాలో తెలిసిన గొప్ప శాస్త్రవేత్త అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు తెలిస్తే.. జగన్కు మాత్రం ఎలా కూల్చాలో తెలుసని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!