38 కేసుల్లో ఏ1 బయట.. నిజాయతీపరుడు జైల్లో..
రూ.42 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి.. సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1గా ఉన్న సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉంటే.. ఏ తప్పూ చేయని చంద్రబాబు మాత్రం జైల్లో ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.
నిరసనలపై తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్న
ఈనాడు డిజిటల్, అమరావతి: రూ.42 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి.. సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1గా ఉన్న సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్పై ఉంటే.. ఏ తప్పూ చేయని చంద్రబాబు మాత్రం జైల్లో ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. జగన్కు బెయిల్ మంజూరై శనివారంతో పదేళ్లయిన సందర్భంగా ‘ఖైదీ నంబర్ 6093.. బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్’ అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బాపట్ల మండలం కొత్తఓడరేవు సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటుచేసిన వారిపై కేసు పెట్టడాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే చివరికి అంతరిక్షం, సముద్రం, భూగర్భాల్లోనూ 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 విధించేలా ఉందన్నారు. ‘శాంతియుత నిరసనలనూ అనుమతించవద్దని డీజీపీని సీఎం ఎందుకు ఆదేశించారు? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును మీరెలా కాదనగలరు? పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఏపీలో ఎందుకు? తెలంగాణలో లేని నిర్బంధాలు మన రాష్ట్రంలోనే ఎందుకు చేస్తున్నారో సైకో సర్కారు చెప్పాలి? ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని అక్రమ విధానాలతో అడ్డుకోలేరు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
మిజోరంలో జడ్పీఎం జోరు
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరపడింది. -
హామీల అమలుకు కాంగ్రెస్కు సమయమిద్దాం
రెండుసార్లు మనల్ని గెలిపించిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పాలించే అవకాశమిచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ఆర్నెల్ల సమయమిద్దామని భారాస అధినేత కేసీఆర్ తమ పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!