ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో చెప్పలేను..

తాను ఎంతకాలం పదవిలో కొనసాగుతానో కచ్చితంగా తెలియదంటూ తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.

Published : 26 Sep 2023 06:03 IST

చర్చకు దారితీసిన అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలు

ముంబయి: తాను ఎంతకాలం పదవిలో కొనసాగుతానో కచ్చితంగా తెలియదంటూ తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. కొద్ది నెలల క్రితం అజిత్‌ తన బాబాయ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు షాకిచ్చి.. రాష్ట్రంలోని భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మాటలు చూస్తుంటే పొత్తు సాగదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా ముంబయిలో పర్యటించారు. ఈ సమావేశానికి అజిత్‌ హాజరుకాలేదు. ఇది చర్చకు దారితీసింది. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్లు అమిత్‌ షా కార్యాలయానికి వెల్లడించానని అజిత్‌ సమాధానమిచ్చారు. ఇంతలో ఆయన పుణెలోని బారామతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నాను. అయితే రేపు ఆ స్థానంలో ఉంటానో? లేదో? నేను చెప్పలేను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని