KTR: మోదీ.. తెలంగాణపై ఎందుకింత వ్యతిరేకత?
ప్రధానమంత్రి డీఎన్ఏలోనే తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు.
తల్లిని చంపి బిడ్డను వేరు చేశారనడం అజ్ఞానమే
రాబోయే ఎన్నికల్లో భాజపా అడ్రస్ గల్లంతే
మండిపడిన కేటీఆర్
ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనపై గవర్నర్ నిర్ణయం
అప్రజాస్వామికమని విమర్శ
పదేళ్లుగా తెలంగాణ మీద, రాష్ట్రం ఏర్పాటు మీద మీరు(మోదీ) సందర్భం దొరికినా.. దొరకకపోయినా ఎందుకు విషం చిమ్ముతున్నారు? తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ.. ప్రజల ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? తెలంగాణపై మీకు ఎందుకింత వ్యతిరేకత? ఇక్కడి త్యాగాల పట్ల ఎందుకు చిన్నచూపు? తల్లిని చంపి, బిడ్డను వేరు చేశారని మీరు మాట్లాడడం అజ్ఞానం కాదా?
కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ప్రధానమంత్రి డీఎన్ఏలోనే తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. అందుకే పగబట్టినట్టు.. తెలంగాణ పుట్టుకను, అస్థిత్వాన్ని, ఉద్యమాన్ని పదే పదే అగౌరవపరుస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపాలో ఆయన మొదలు గల్లీ స్థాయి నాయకుడి దాకా ఇదే ధోరణిలో తెలంగాణపై విషం చిమ్ముతున్నారని అన్నారు. అక్టోబరు 1న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీని భారాస, తెలంగాణ ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నామన్నారు. ‘మోదీ పాలమూరు గడ్డపై కాలు పెట్టేటప్పుడు.. కృష్ణా జలాల వాటాపై స్పష్టత ఇవ్వాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. తెలంగాణ జాతికి ద్రోహం, దగా చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సైదిరెడ్డి, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, భారాస నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ తదితరులతో కలిసి మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తగులుతుంది
‘‘విభజన హామీలను మోదీ పాతరేశారు. అందుకు ప్రతిఫలం ఉంటుంది. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే రాష్ట్రంలో మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందో.. మీ దిక్కుమాలిన వ్యవహారం వల్ల రాబోయే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లోనూ అడ్రస్ లేకుండా పోతుంది. తెలంగాణ ప్రజలశాపం మీకు తప్పకుండా తగులుతుంది’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గమైన ప్రధానమంత్రి ఈ దేశంలో ఇప్పటిదాకా లేరని, బహుశా భవిష్యత్తులో కూడా రారని ఆయన అన్నారు.
మోదీ ఏజెంటుగా గవర్నర్
‘‘రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. పైన ప్రధానమంత్రి మోదీ.. ఇక్కడ మోదీ ఏజెంటు గవర్నర్ కూడా అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న వారిని ఇలాంటి పదవుల్లోకి తీసుకురావద్దని గవర్నర్ లేఖ రాశారు. ఇంతకంటే హాస్యాస్పదం మరోటి లేదు. ఆమె గవర్నర్ అవడానికి ఒకరోజు ముందు వరకు కూడా.. తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా పనిచేశారు. మరి ఆమె ఎలా అర్హురాలు అవుతారు? గవర్నర్ అయ్యాక కూడా ఆమె ఇప్పటికీ భాజపా నాయకురాలిగా పనిచేయడం లేదా?
అవసరమైన డాక్యుమెంట్లు మళ్లీ పంపిస్తాం
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవాళ్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్లు నామినేట్ చేసిన సంఘటనలు అనేకమున్నాయి. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వారు అనర్హులని చెబుతారు. గవర్నర్ కోరిన విధంగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు జతపర్చి మళ్లీ పంపిస్తాం. ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం’’ అని కేటీఆర్ తెలిపారు.
అన్ఫిట్ నాయకుడు కిషన్రెడ్డి
దేశం మొత్తమ్మీద అన్ఫిట్ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది కిషన్రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. ఆయన సొంత నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేని అసమర్థుడని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. -
రాష్ట్రంలో త్వరలో నిశ్శబ్ద యుద్ధం
‘‘సైకో జగన్.. ధనవంతులకు, పేదలకు యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. అది.. జగన్కు, పేదలకు మధ్య జరగనుంది. -
‘మాకెందుకు జగన్?’
‘ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే..’, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పేరిట వైకాపా నేతలు, వాలంటీర్లు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. సీఎం మేనమామ రవీంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో మాత్రం ‘మాకెందుకు జగన్?’ అంటున్నారు. -
బడిలో ‘జగనే ఎందుకు కావాలి?’
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని వేంబాకం ఉన్నత పాఠశాలలో ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలు తావిచ్చింది. -
మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభం
ప్రధాని మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభమేనని, పవిత్ర కార్యాలకు ఆయన్ను భాజపా దూరం ఉంచాలంటూ జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్రవణ్కుమార్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ను నడపగలిగే సరైన నేత ఖర్గే
రానున్న చరిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడపగలిగే సరైన నేత మల్లికార్జున ఖర్గే అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. -
అది జగన్ను ఆటాడేసుకునే కార్యక్రమంగా మారింది
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్తా సీఎం జగన్ను సామాజిక మాధ్యమాల్లో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. -
ఎస్టీ ఉపప్రణాళిక నిధులను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం
గిరిజనుల అభ్యున్నతికి కేంద్రం మంజూరు చేస్తున్న ఎస్టీ సబ్ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
విశాఖ నుంచే మరోసారి ఎంపీగా పోటీ
వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లు తెదేపాలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవరాయునిపేట పరిధిలో పనిచేస్తూ రాజీనామా చేసిన వాలంటీర్లు వి.ఉదయకిరణ్, కె.రాధిక, ఎస్.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి బుధవారం తెదేపాలో చేరారు. -
1న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని డిసెంబరు 1న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్
వైయస్ఆర్ జిల్లా పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు. -
జగన్ అండతోనే దళితులపై అకృత్యాలు
సీఎం జగన్ అండ చూసుకొని, ఆయన మెప్పు కోసమే వైకాపా నేతలు దళితులపై దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. -
సీఎం జగన్పై సర్పంచి ‘పంచ్లు’.. జనసేన నేత శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు
‘ఒక్క రోడ్డు లేదు. విద్యుత్తు ఛార్జీలు రూ. 500 నుంచి రూ.5 వేలకు పెరిగాయి. అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి. -
నిరాడంబర దుస్తులు ధరించినా.. వారంతా సంపన్నులే
కొందరు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్రధారణ, వారు ధరించిన సాధారణ చేతిగడియారాలు చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా